పైన ఫొటోలో కనిపిస్తున్న వివాహితపేరు శ్రీవాణి. ఎనిమిది నెలల కిందటే ఓ వ్యక్తితో పెళ్లైంది. కట్ చేస్తే.. ఉన్నట్టుండి ఊహించని పరిణామాం చోటు చేసుకుంది. పెళ్లై ఏడాది కూడా కాకముందే ఇలా జరగడంతో భర్త కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. అసలేం జరిగిందంటే?
ఆమె పేరు శ్రీవాణి. గత 8 నెలల కిందటే ఓ యువకుడితో వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత భార్యాభర్తలు నగరంలోని చింతలకుంటలో నివాసం ఉంటున్నారు. దంపతులు ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ కాపురాన్ని నెట్టుకొస్తున్నారు. ఇక ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేకుండా భార్యాభర్తలు సంతోషంగా జీవిస్తున్నారు. కట్ చేస్తే పెళ్లై ఏడాది కూడా కాలేదు.. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం చింతలకుంటలో రావుల శ్రీవాణి-మహేష్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత ఎనిమిది నెలల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతు వైవాహిక జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. భార్యాభర్తలు స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ కాపురాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే ఏం జరిగిందో ఏం తెలియదు కానీ, గత నెల 28న డ్యూటీకి వెళ్తున్న అని భర్తకు చెప్పి వెళ్లిన శ్రీవాణి.. రాత్రై 10 గంటలు దాటినా ఇంటికి రాలేదు.
దీంతో ఖంగారుపడ్డ భర్త పరిసర ప్రాంతాల్లో అంతటా వెతికాడు. అయినా భార్య జాడ మాత్రం దొరకలేదు. ఇక ఏం చేయాలో తెలియక బంధువులందరికీ సమాచారం అందించాడు. 24 గంటలు గడిచినా శ్రీవాణి ఆచూకి మాత్రం కనిపించలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాని భర్త.. వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీవాణి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఉన్నట్టుండి శ్రీవాణి కనిపించకుండపోవడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.