ఈ యువతి పేరు అనూష. గత రెండేళ్ల కిందట ఇంటర్ పూర్తి చేసి అప్పటి నుంచి నీట్ కు ప్రిపేర్ అవుతూ ఉంది. ఈ క్రమంలోనే అనూష కనిపించకుండపోయి చివరికి రామంతాపూర్ చెరువులో శవమై తేలింది. అసలేం జరిగిందంటే?
పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు అనూష. హైదరాబాద్ రామంతాపూర్ నివాసం ఉంటున్న ఈ యువతి ఇంటర్ వరకు చదివి నీట్ కు ప్రిపేర్ అవుతూ ఉంది. అయితే ఈ బుధవారం తెల్లవారుజామున నుంచి అనూష కనిపించకుండపోయింది. దీంతో ఖంగారుపడ్డ తల్లిదండ్రులు, బంధువులు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించారు. కానీ, యువతి ఆచూకి మాత్రం దొరకలేదు. కట్ చేస్తే అనూష గురువారం రామాంతాపూర్ చెరువులో శవమై తేలింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ రామంతాపూర్ పరిధిలోని ఇందిరా నగర్ లో అనూష అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. 2020లో ఇంటర్ పూర్తి చేసిన అనూష.. అప్పటి నుంచి నీట్ కు ప్రిపేర్ అవుతుంది. కానీ, రెండుసార్లు రాసినా.. నీట్ లో సీటు దక్కించుకోలేకపోయింది. దీంతో నీట్ కు ప్రిపేర్ కావడం నా వల్ల కాదు అనుకుంది. అయినా సరే తల్లిదండ్రులు బలవంతం చేసి నీట్ లో సీటు సాధించాలని చేప్పినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే అనూష తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ చదువులు నా వల్ల కాదు అనుకుందో ఏమో కానీ.. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచి నేరుగా రామంతాపూర్ చెరువు వద్దకు వెళ్లింది. అక్కడికి వెళ్లాక అటు ఇటూ చూసింది. ఎవరూ కనిపించకపోవడంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరికి రామంతాపూర చెరువులో ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. అనంతరం ఆ యువతి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు అనూష మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.