హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. పెంచి పెద్దచేసిన తల్లిని ఓ కుమారుడు హత్య చేసిన ఘటన తాజాగా సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. హైదరాబాద్ దిల్సుఖ్నగర్కు చెందిన జంగయ్య యాదవ్, భూదేవి (58) ఇద్దరు భార్యాభర్తలు. జంగయ్య యాదవ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే వీరికి పిల్లలు కలగకపోవడంతో 1995లో బంధువుల నుంచి ఓ మగబిడ్డను దత్తత తెచ్చు కుని పెంచుకున్నారు. ఇతనికి సాయితేజ అని పేరు పెట్టి సాదుకున్నారు.
కానీ పెరిగి పెద్దవాడైన సాయితేజకు మతిస్థిమితం సరిగ్గా లేదు. అయితే ఈ మహానుభావుడు స్థానికంగా ఓ అమ్మాయిని ప్రేమించాడు. దీంతో ఆ యువతి అడిగిందల్లా తెచ్చిస్తూ ప్రేమాయణాన్ని సాగించాడు. ఇక ఇంట్లో నగదు, బంగారం ఉన్నాయని తెలుసుకున్న సాయితేజ.. వాటిని తన ప్రియురాలికి ఇవ్వాలనుకున్నాడు. కానీ దీనికి తన తల్లి అంగీకరించలేదు. దీంతో కోపంతో ఊగిపోయాడు. ఎలాగైన తల్లిని హత్య చేయాలని భావించి ఇక అనుకున్నట్లుగానే స్నేహితుడైన నర్సింహను కొంత డబ్బు కూడా ఇస్తానని చెప్పి సాయం చేయాలని కోరాడు. దీనికి స్నేహితుడు కూడా అంగీకరించాడు. తర్వాత నర్సింహ ఈ విషయాన్ని తన స్నేహితులైన వట్టికోటి శివ, చింటు, అంజి, సాయిగౌడ్లకు చెప్పి వారి సాయాన్ని కోరాడు.
ఇది కూడా చదవండి: Chhattisgarh: విషాదం.. కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలట్ల దుర్మరణం!ఇక దీంతో అందరూ కలిసి ఈనెల 6న అర్ధరాత్రి సాయితేజ ఇంటికి వెళ్లి నిద్రలో ఉన్న సాయితేజ తల్లి అయిన భూదేవిని దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇంట్లో ఉన్న రూ. 10 లక్షల నగదు, 30 తులాల బంగారం తీసుకుని అందరూ పరారయ్యారు. దీంతో ఈ విషయం సాయితేజకు తెలిస్తే అందరికీ చెబుతాడని భావించి సాయితేజను ఎలాగో నమ్మించి చివరికి శ్రీశైలం రావాలంటూ కబురు పంపారు. ఇక సాయితేజ కూడా నమ్మి వారి వెంట వెళ్లాడు, ఇక వెళ్లిన అనంతరం మల్లెలతీర్థవం వద్ద అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలోనే సాయితేజతో శివ అనే వ్యక్తి గొడవ పెట్టుకున్నాడు. దీంతో కోపంతో ఊగిపోయిన శివ సాయితేజను దారుణంగా హత్య చేసి శవాన్ని మల్లెలతీర్థం జలపాతంలో విసిరేశారు.
దీంతో వెంటనే అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్న శివ సాయితేజను హత్యచేశాననే భయంతో ఏం చేయాలో అర్థం కాక సరూర్నగర్ పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం ఉదయం 10:30 గంటలకు అమ్రాబాద్ పోలీసులు, అటవీ అధికారుల సహకారంతో మల్లెల తీర్థం జలపాతం వద్దకు చేరుకుని సాయి తేజ మృతదేహాన్ని వెలికితీసి రూ.1.40 లక్షల నగదు, బంగారు హారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితులు నర్సింహా, చింటు, అంజి, సాయిగౌడ్లను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.