ఓ చిన్న అనుమానమే నిండు సంసారాలను నాశనం చేస్తుంది. భార్యపై కొందరు భర్తలు అనుమానం పెంచుకుంటున్నారు. ఇక అంతటితో ఆగకుండా హత్యలకు చేసేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య కనిపించకుండా పోయింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇది కూడా చదవండి: Vikarabad:భర్త ప్రాణస్నేహితుడితో లేచిపోయిన ఇద్దరు పిల్లల తల్లి!
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది హైదరాబాద్ యూసుఫ్గూడ సమీపంలోని బ్రహ్మశంకర్ నగర్ ప్రాంతం. భాగ్యశ్రీ, మహేశ్ అనే ఈ దంపతులు ఇక్కడే నివాసం ఉంటున్నారు. అయితే గత కొంత కాలం నుంచి భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్య బ్యూటీ పార్లర్ కు వెళ్లడంతో మహేష్ కు అస్సలు నచ్చేది కాదు. ఇక ఇదే విషయమై భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు కూడా జరిగాయి.
దీంతో భార్య భాగ్యశ్రీ భర్త తీరుతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6వ తేదీన తన ఇద్దరు పిల్లలతో కనిపించకుండా పోయింది. దీంతో ఖంగారు పడ్డ భర్త బంధువులందరికీ ఫోన్ చేసి తెలుసుకున్నా భార్య జాడ మాత్రం దొరకలేదు. దీంతో ఏం చేయాలో తెలియక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.