తల్లిపై కోపంతో అలిగిన ఓ 13 ఏళ్ల బాలిక ఇల్లు వదిలి వెళ్లిపోయింది. వెళ్తూ.. వెళ్లూ.. అమ్మ.. నువ్వు నాకు నచ్చలేదు అంటూ లేఖ రాసింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా వివేకనందపురంలో 13 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటోంది. అయితే ఈ బాలిక అమ్ములుగూడలో ఓ స్కూల్ లో 7వ తరగతి చదువుతోంది. ఇదిలా ఉంటే ఈ బాలికను తల్లి ఇటీవల మందలించింది.
దీంతో అప్పటి నుంచి బాలిక తల్లిపై కోపం పెంచుకుంది. ఎలాగైన తల్లి చెర నుంచి వెళ్లాలని ప్లాన్ వేసుకుని క్షణికావేశంలో ఇటీవల ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఇక ఆ బాలిక వెళ్తూ.. వెళ్తూ.. అమ్మ.. నువ్వు నాకు నచ్చలేదు. నా కోసం వెతకొద్దు. ఐ హేట్ యూ అంటూ ఇంట్లో లేఖను రాసి వెళ్లిపోయింది. దీంతో రాత్రి అయినా కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అటూ ఇటూ అంతా వెతికారు.
ఇది కూడా చదవండి: Tirupati: భార్యపై కోపం.. కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి!
ఎంత వెతికిన కూడా కూతురు జాడ కనిపించలేదు. ఇక ఖంగారుపడ్డ తల్లిదండ్రులు చేసేదేం లేక వెంటనే నేరెడ్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకి వెతికి తల్లిదండ్రులకు అప్పగించారు. కూతురు ఆచూకి తెలియడంతో ఆ బాలిక తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.