ఈ రోజుల్లో చదువు చెప్పాల్సిన కొందరు గురువులే మృగాలుగా మారిపోతున్నారు. అందమైన విద్యార్థులకు ప్రేమ పాఠాలు చెప్పి వలలో వేసుకుంటున్నారు. ఇక ఇంతటితో ఆగక నమ్మించి ఎక్కడికో తీసుకెళ్లి చివరికి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వెలుగు చూసింది. హిందీ ప్రెఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్న కీచక మాస్టారు ఓ విద్యార్థికి హిందీ బేసిక్స్ నేర్పిస్తానని నమ్మించి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తాజాగా ఇదే ఘటన తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఉన్నత చదువులు చదువుకోవడానికి ఇక్కడికి అనేక దేశాల నుంచి ఎంతో మంది విద్యార్థులు వస్తుంటారు. ఎంతో కష్టపడి చదివి వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
ఇక ఎంతో పేరు పొందిన ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తాజాగా దారుణం చోటు చేసుకుంది. విషయం ఏంటంటే? ఇదే యూనివర్సిటీలో రవిరంజన్ అనే వ్యక్తి హిందీ ప్రోఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అలా తాను విధులు నిర్వర్తిస్తున్న క్రమంలోనే థాయ్ లాండ్ కు చెందిన ఓ విద్యార్ధిపై ప్రొఫెసర్ రవిరంజన్ గత కొంత కాలం నుంచి ఓ కన్నేసి ఉంచాడు. ఎలాగైనా ఆ విద్యార్థితో కలిసి కోరికలు తీర్చుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఆ ప్రొఫెసర్ ఎన్నో ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల ఓ రోజు రాత్రి ప్రొఫెసర్ రవిరంజన్ ఆ విద్యార్థితో మాట్లాడాడు. నీకు హిందీ బేసిక్స్ నేర్పిస్తానని ఆ విద్యార్థికి మాయమాటలు చెప్పి తన కారులో ఎక్కించుకుని నేరుగా తన ఇంటికి తీసుకెళ్లాడు.
అనంతరం ఆ యువతికి బలవంతంగా మద్యం తాగించాడు. ఇక ఇంతటితో ఆగని ఆ కామ ప్రొఫెసర్.. ఆ విద్యార్థిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి ప్రతిఘటించడంతో ఆ ప్రొఫెసర్ మళ్లీ కారులో ఎక్కించుకుని యూనివర్సిటీ గేట్ ముందు వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక అదే రాత్రి ఆ విద్యార్థి ఏడ్చుకుంటూ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. నిందితుడు ప్రొఫెసర్ రవిరంజన్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రొఫెసర్ చేసిన దారుణం నిజమేనని తేలడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు అతడిని సస్పెండ్ చేశారు. తాజాగా ఇదే ఘటన తీవ్ర కలకలంగా మారింది.