ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. బతుకు దెరువు కోసం ఉన్న ఊరిని కాదని నగరానికి వచ్చి చిన్నా చితక పనులు చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. దీంతో వీరి జీవితం సంతోషంగా సాగుతున్న తరుణంలో ఆ మహిళ ఊహించని నిర్ణయం తీసుకుని భర్తకు, పిల్లలకు తీరని అన్యాయం చేసి వెళ్లిపోయింది. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా రావులపల్లి మండలం మందనపల్లి. ఇదే గ్రామానికి చెందిన చుక్క శ్రీను, దేవి భార్యాభర్తలు. వీరికి 2013లో వివాహం జరగగా, కొంతకాలానికి ఓ కుమారుడు, ఓ కుమార్తె జన్మించారు. ఇక ఉన్న ఊరిలో పని దొరకక బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి బషీరాబాద్ ఓ ఇంట్లో అద్దెకు దిగారు. భర్త ఆటో నడుపుతుండగా, భార్య సేల్స్ మెన్ గా పని చేస్తున్నారు. అలా వీరి కాపురం ఉన్నదాంట్లో సర్దకుంటూ ఎలాంటి గొడవలు, విభేదాలు లేకుండా చక్కగా సాగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.., గత కొంత కాలం నుంచి దేవి కడుపు నొప్పి సమస్యతో తీవ్రంగా బాధపడుతోంది.
ఈ విషయాన్ని భర్తకు చెబితే ఎక్కడ బాధపడతాడోనని తనలో తాను కుమిలిపోతూ నరకాన్ని దగ్గరనుంచి చూసేది. అయితే ఈ క్రమంలోనే సోమవారం రోజున దేవి పుట్టిన రోజు కావడంతో పిల్లలతో పాటు భార్యాభర్తలు పుట్టిన రోజు వేడుకలు సంతోషంగా జరుపుకున్నారు. ఇక మరుసటి మంగళవారం దేవి రోజులాగే తన విధుల్లోకి వెళ్లింది. ఉన్నట్టుండి దేవికి విపరీతమైన కడుపునొప్పి రావడంతో మధ్యాహ్నమే ఇంటికి వచ్చింది. భరించలేని కడుపునొపి రావడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక నా వల్ల కాదని భావించిన దేవి ఫ్యాన్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
సాయంత్రానికి భర్త ఇంటికి రాగానే లోపలి నుంచి తలుపులకు గడియ పెట్టి ఉంది. ఇక అనుమానం వచ్చిన భర్త శ్రీను బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.., భార్య ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఈ సీన్ ను చూసిన భర్తకు ఏం చేయాలో అర్థం కాక కన్నీరు మున్నీరుగా విలపించాడు. పక్కన ఓ సూసైడ్ నోట్ లభించింది. పిల్లలను బాగా చూసుకో, మరో పెళ్లి చేసుకోకు జాగ్రత్త అంటూ దేవి సూసైడ్ నోట్ లో పేర్కొంది. వెంటనే భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి సమాచారమందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇలా కడుపునొప్పిని భరించలేక ఆత్మహత్య చేసుకున్న దేవి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.