హయత్ నగర్ లో రాకేష్ అనే యువకుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా సంచలన నిజాలు బయటపెట్టారు. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఈ యువకుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. నాలుగు రోజుల కిందట నగ్నంగా ఓ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఘటనా స్థలంలో దొరికిన కొన్ని వస్తువులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకుని కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా సంచలన నిజాలు బయటపెట్టారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన రాజేష్ (23) అనే యువకుడు ఓ ఇంజనీరింగ్ కాలేజీలో పని చేసినట్లు తెలుస్తుంది. ఇతడు ఈ నెల 24న హైదరాబాద్ పరిసర ప్రాంతమైన ఇబ్రంహీపట్నంలో వివాహం ఉందని వచ్చాడు. ఆ తర్వాత స్నేహితులు, కుటుంబ సభ్యులు అతడికి సాయంత్రం ఎన్నోసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. చివరికి హయత్ నగర్ లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలోని వేంచర్ గోడల మధ్య శవమై కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మా కుమారుడుని చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.
ఈ కేసులో పోలీసుల ప్రాథమిక విచారణ తరువాత సంచలన నిజాలు బయటికి వచ్చాయి. హైదరాబాద్ లోని సుజాత అనే మహిళ ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తుంది. ఆమె, రాజేష్ గత కొన్ని రోజులుగా ఫోన్ లో మాట్లాడుకుంటున్నట్లు తేలింది. ఆమెతో ఇతనికి వివాహేతర సంబంధం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. మూడు రోజుల ముందు సుజాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె భర్త వెంటనే నగరంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించాడు. కానీ, ఫలితం లేకపోవడంతో సుజాత చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సుజాత భర్త స్పందిస్తూ.. నా భార్యకు రాజేష్ బలవంతంగా పురుగుల మందు తాగించాడని, అతని కారణంగానే సుజాత చనిపోయిందనే ఆరోపణలు చేశాడు.