ఈజీ మనీ కోసం ఎదుటి వారి ప్రాణాలు ఏమైనా తమకు పట్టింపు లేదు అన్న చందంగా కొంత మంది కేటుగాళ్లు తయారయ్యారు. ఈ క్రమంలో మద్యం, వ్యభిచారం, డ్రగ్స్ వ్యాపారం లాంటివి చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. గుజరాత్లో కల్తీ మద్యం 18 మంది కూలీలను బలిగొంది. మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు లోనై గుజరాత్లోని అహ్మదాబాద్, దండూక, బర్వాల పరిసరాల్లోంచి బాధితులు ఆస్పత్రుల్లో చేరారు. వివరాల్లోకి వెళితే..
గుజరాత్లోని డండూక ప్రాంత పరిసరాల్లోనూ లిక్కర్ సేవించినవారు అస్వస్థతకు గురికావడంతో చికిత్సకోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. నాటుసారా, చీపు లిక్కరు సేవించి అనారోగ్యానికి గురయ్యారని అధికారుల విచారణలో తేలింది. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలుగా పోలీసులు తెలిపారు.
బర్వాలా పోలీస్స్టేషన్ పరిసరాల్లోని కల్తీమద్యం సేవించిన గ్రామాల్లో, వైద్యాధికారులు, పోలీసులు అధికారులు పర్యటించారు. సారా బాధిత కుటుంబాలను విచారించి వివరాలను నమోదు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. విచారణకు సిట్ను ఏర్పాటు చేసింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగానే ఉందని అధికారులు తెలిపారు. నాటు సారా తయారు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.