డబ్బు కోసం, శారీరిక సుఖం కోసం కొన్నిసార్లు అడుగులు దారి తప్పుతుంటాయి. ఒక్కసారి ఈ పని చేస్తే.. ఇక జీవితంలో పోయిన పరువు తిరిగి రాదు. తాజాగా ఏపీలోని గుడివాడ టౌన్ పరిధిలోని గుడ్ మేన్ పేట కాలనీకి చెందిన ఓ మహిళ కూడా ఇలాంటి తప్పే చేసింది. ఇప్పుడు పోలీసులకి పట్టుబడి తన కుటుంబ పరువుని బజారున పెట్టింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొన్ని రోజుల క్రితం గుడివాడలో 15 ఏళ్ల మైనర్ బాలుడు, పక్కింటి భార్య కనిపించకుండా పోయిన ఘటన వైరల్ అయ్యింది.
ఒకే రోజు ఇద్దరు కనిపించకుండా పోవడంతో బాలుడి తల్లిదండ్రులు ఖంగారుపడి అటు ఇటు అంతా వెతికారు. ఎంత వెతికినా తమ బాలుడి జాడ కనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా బాలుడి ఆచూకి కోసం వెతుకున్న క్రమంలోనే వీరి పక్కింట్లో ఉంటున్న ఇద్దరు పిల్లలు ఉన్న వివాహిత కూడా కనిపించకుండా పోయింది. ఇక వెంటనే ఆ బాలుడి తల్లిదండ్రులకు అనుమానమొచ్చి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకుని విచారణని వేగవంతం చేశారు.
ఈ కేసు నమోదు అయిన నాటి నుండి ఆ మహిళ.. మైనర్ బాలుడికి మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళిపోయిందా? అసలు డబ్బు కోసం ఇలా చేసిందా? లేక శారీరిక సుఖం కోసం బాలుడిని ట్రాప్ చేసిందా? అసలు ఈ రెండు మిస్సింగ్ కేసులకు సంబంధం లేదా? అనే కోణాల్లో పోలీసులు చాలా రకాలుగా విచారణ జరిపారు. దీంతో.. నిందితురాలు బాలుడికి మాయమాటలు చెప్పి హైదరాబాద్ తీసుకెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ విషయాన్ని గుడివాడ టూ టౌన్ సీఐ దుర్గారావు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం వీరిని హైదరాబాద్ నుండి గుడివాడకు తీసుకురానున్నారు. మరి.. ఓ మైనర్ బాలుడి పట్ల.. ఈ 30 ఏళ్ళ వివాహిత చేసిన ఈ నీచమైన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.