తెల్లారితే పెళ్లి కావడంతో వధువు, వరుడు తల్లిదండ్రులు చకచక పెళ్లి పనులు పూర్తి చేశారు. ఇరువురి బంధువులు అంతా చేరుకున్నారు. అంతలోనే వరుడు షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
తెల్లారితే పెళ్లి.. దగ్గరి బంధువులు అంతా వరుడి ఇంటికి చేరుకున్నారు. బాజా భజంత్రిలతో ఇళ్లంతా సందడిగా మారింది. ఇక అటు పక్క వధువు కుటుంబ సభ్యులు సైతం ఎంతో సంతోషంగా పెళ్లి పనులు కానిచ్చేస్తున్నారు. తెల్లారితే పెళ్లి కావడంతో చక చక పెళ్లి పనులు అన్నీ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే వరుడి ఇంటి నుంచి ఓ షాకింగ్ వార్త వధువు తండ్రికి తెలిసింది. ఈ వార్తతో వధువు తండ్రితో పాటు అతని బంధువులు సైతం ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరు మండలంలోని కొవ్వలి గ్రామం. ఇక్కడే మన్నె రాము (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు గత కొంత కాలం నుంచి వాలంటీర్ గా పని చేస్తున్నాడు. అయితే ఇతనికి స్థానికంగా ఉండే యువతితో ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఇక శనివారం పెళ్లి కావడంతో వరుడి తల్లిదండ్రులు, బంధువులు అంతా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో వరుడి ఇళ్లంతా సందడి సందడిగా మారింది.
ఇదిలా ఉంటే.. తెల్లారితే పెళ్లి కావడంతో వధువు తల్లిదండ్రులు సైతం అన్ని ఏర్పాటు చేశారు. ఇక వధువు ఇంటికి వారి బంధువులు రావడంతో అంతా సందడి సందడిగా మారిది. ఈ క్రమంలోనే శుక్రవారం వరుడి ఇంటి నుంచి.. పెళ్లి కొడుకు రాము చనిపోయాడని ఫోన్ కాల్ వచ్చింది. ఈ వార్త విన్న వధువు తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఉన్నట్టుండి రాము మరణించడంతో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
విషయం ఏంటంటే?.. గత కొంత కాలం నుంచి రాము కడుపు నొప్పితో బాధపడుతున్నాడని, దీనిని భరించలేక శుక్రవారం ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెల్లారితే పెళ్లి.. అంతలోనే వరుడు మరణించడంతో రాము కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ వార్తతో అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లికి ముందు రోజుతో కడుపు నొప్పి బాధతో ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.