ఈ మద్య మానవ సంబంధాలు పూర్తిగా బ్రస్టుపట్టిపోతున్నాయి. కొంతమంది అక్రమసంబంధాల నేపథ్యంలో కన్న పిల్లలను కడతేర్చుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
ఇటీవల కొంతమంది సినిమాలు, సీరియల్స్ చూసి వాటి నుంచి స్ఫూర్తి పొంది నేరాలు చేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ మద్య కొన్ని క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న వెబ్ సీరీస్, సినిమాలను చూసి నేరాలకు పాల్పపడ్డామని పోలీసులకు షాక్ ఇస్తున్నారు కొంతమంది నేరస్తులు. ఆ మద్య మాలీవుడ్ లో వచ్చిన దృశ్యం మూవీ తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. ఓ మహిళ ఆ సినిమాను చూసి స్ఫూర్తి పొంది సొంత కొడుకునే చంసింది. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన సొంతకొడుకునే అత్యంత కిరాతకంగా హత్యచేసి గుట్టుచప్పుడు కాకుండా దాచింది. పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టడంతో అసలు గుట్టు బయట పెట్టింది. విచారణలో భాగంగా ఆ మహిళ దిమ్మతిరిగే నిజాలు బయటపెట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్కు చెందిన నైన మాండవి అనే మహిళకు క్రైమ్ థ్రిల్లర్ మూవీలు చూసే అలవాటు ఎక్కువగా ఉంది. జూన్ 27న తన కొడుకు కనిపించకుండా పోయాడని దిండోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
పోలీసుల దర్యాప్తులో పిల్లవాడు ఇంటిని విచిపెట్టి వెళ్లినట్లు ఆధారాలు దొరకలేదు. దీంతో తల్లిపై అనుమానం వచ్చి తమదైన స్టైల్లో విచారించారు. పోలీసులు విచారణలో తన కొడుకును తానే చంపానని.. దృశ్యం మూవీ స్ఫూర్తితో అలా చేశానని తెలిపింది. దీంతో ఆ మహిళపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విచారణలో సంచలన నిజాలు బయటపెట్టింది.. తన కొడుకు తన వద్ద ఉంటే.. పెళ్లి చేసుకోనని ప్రియుడు చెప్పడంతో కొడుకు అడ్డు తొలగించేందుకు తన బిడ్డను చంపాల్సి వచ్చిందని.. హత్య చేసి, బాలుడి మృతదేహాన్ని కాలనీ వెనుక బహిరంగ ప్రదేశంలో పాతిపెట్టినట్లు అంగీకరించింది. అయితే దృశ్యం సినిమాలో మాదిరిగా తన బిడ్డను దాచడం ద్వారా చట్టం నుంచి తప్పించుకోవచ్చు ని భావించానని.. కానీ తన గుట్టు రట్టు అయ్యిందని కన్నీరు పెట్టుకుంది. ఆ మహిళ చూపించి స్థలంలో ఎలాంటి అవశేషాలు లభించలేదు.