ఇటీవల కోనసీమ జిల్లాలోని ఓ మహిళ యువకుడి మర్మాంగంపై దాడి చేసిన విషయం మన అందికీ తెలిసిందే. అయితే ఈ ఘటనతో మీడియాలో అనేక కథనాలు వెల్లువడ్డాయి. ఆ మహిళ ఉద్దేశపూర్వకంగా అతని మర్మాంగంపై దాడి చేసిందని, ప్రియుడిని ఇంటికి పిలిచి మరీ ప్రియురాలు ఇలా చేసిందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా దాడి చేసిన మహిళ స్పందించి అసలు నిజాలు బయటపెట్టింది. ఈ ఘటనలో ఏం జరిగింది? తాజాగా ఆ మహిళ చెప్పిన నిజాలు ఏంటనే పూర్తి వివరాలు మీ కోసం.
అది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక గ్రామం. ఇదే గ్రామంలో ఓ మహిళ నివాసం ఉంటుంది. అయితే ఆ వివాహిత స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిందని, ఇటీవల తన ప్రియుడిని ఇంటికి పిలిచి మరీ అతడి మర్మాంగంపై దాడి చేసిందనే వార్తలు వినిపించాయి. ఇక ఈ దాడి ఘటనలో వస్తున్న అనేక వార్తలపై దాడి చేసిన తాజాగా స్పందించింది.. నాపై మీడియా అసత్య ప్రచారం చేస్తుందని వాపోయింది. ప్రియుడుని ఇంటికి పిలిచి దాడి చేసిందని కూడా ప్రచారం చేశారని, మీరిలా చేస్తే నాకు ఆత్మహత్యే దిక్కు అంటూ ఆ మహిళ బోరున ఏడ్చింది.
అసలు ఏం జరిగిందంటే.. దాడి ఘటన రోజు రాత్రి 8.30 గంటలకు కృష్ణ గణేష్ అనే వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. అతడెవరో కాదు మా బంధువే. అయితే మా కుమారుడిని అడిగి, ఆ తర్వాత కొన్నినీళ్లు తీసుకురమ్మన్నాడు. ఇక నీళ్లు తెచ్చి అతనికి ఇచ్చాను. ఇక నీళ్లు తాగిన తర్వాత ఆ వ్యక్తి వచ్చి నా పక్కలో నిలబడ్డాడు. ఏంటని నేను ప్రశ్నించేలోపే అతడు నన్ను అత్యాచారం చేయబోయాడు. ఆ సమయంలో నాకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. నా ఆత్మ రక్షణలో భాగంగా ఇంట్లో ఉన్న బ్లేడు తీసుకుని అతడిపై దాడి చేశానని తెలిపింది. అనంతరం అతడికి ఎక్కడ గాయం అయిందో కూడా తనకు తెలియదని మహిళ వాపోయింది. ఈ ఘటనలో అనవసరంగా ప్రియుడు, ప్రియురాలు అని అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇలా చేస్తే నాకు ఆత్మహత్యే దిక్కు అని ఆమె తెలిపారు. ఈ ఘటనలో మహిళ చెప్పిన నిజాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.