బీజేపీ నేతను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆఫీసులోకి వచ్చి కాల్పులు జరిపి హత్య చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో రాష్ట్రంలో సంచలనంగా మారింది.
గత నెల పుదుచ్చేరిలో సీనియర్ బీజేపీ నేత సింథిల్ కుమార్ ను గుర్తు తెలియని దుండుగులు ముసుగులు ధరించి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా మరో బీజేపీ నేతను కొందరు గుర్తు తెలియని దుండగులు ఆఫీసులోనే కాల్చి చంపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో పార్టీ నేతలు అందరూ ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?
ఢిల్లీకి చెందిన బీజేపీ నేత సురేంద్ర మటియాలా పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే శుక్రవారం ఆయన రాత్రి 7 గంటల సమయంలో ద్వారాకలోని తన ఆఫీసులో టీవీ చూస్తూ కూర్చున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి సురేంద్ర మటియాలాతో మాట్లాడాలని లోపలికి వచ్చారు. ఇక ఆఫీసులోకి వెళ్లి అతనితో మాట్లాడుతున్నట్లు నటించి సురేంద్ర మటియాలాపై ఒక్కసారిగా దాడి చేశారు. ఈ దాడిలో అతడు కిందపోయాడు. వెంటనే ఆ దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు.
ఆఫీసు సిబ్బంది వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలంచి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సురేంద్ర మటియాలాను ఎందుకు హత్య చేశారు? ఎవరు హత్య చేశారనే పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఆఫీసులోనే బీజేపీ నేతను హత్య చేసిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.