దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న అంజలి యాక్సిడెంట్ కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అంజలిని తమ కారుతో ఢీకొట్టిన తర్వాత ఆమె కారు చక్రం దగ్గర ఇరుక్కుందన్న సంగతి తమకు తెలియదని వారు అన్నారు. తాగిన మత్తులో తాము కారు కింద ఇరుక్కున్న ఆమెతో సహా కొన్ని కిలోమీటర్లు చక్కర్లు కొట్టినట్లు తెలిపారు. అంజలి కారు కింది భాగంలో ఇరుక్కుందని తెలిసిన వెంటనే కారు ఆపుచేశామని, ఆమెను కిందపడేసి వెళ్లిపోయామని వెల్లడించారు. పోలీసులు నిందితుల స్టేట్మెంట్ను రికార్డు చేశారు.
వారినుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఓ సంచలనం విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో అంజలి ఒంటరిగా లేదని వెల్లడైంది. హోటల్ దగ్గర అంజలితో పాటు స్కూటీపై మరో యువతి ఉన్నట్లు తేలింది. నిందితులు తమ కారుతో ఢీ కొట్టినపుడు ఆమెకు కూడా దెబ్బలు తగిలి ఉండొచ్చని, దెబ్బల కారణంగా ఆమె ఇంటికి వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ యువతి ఎవరు? ఎక్కడ ఉంటుందనే దానిపై ఆరా తీస్తున్నారు.
అజ్ఞాతంలో ఉన్న ఆమె కోసం అన్వేషిస్తున్నారు. అసలు అంజలికి ఏం జరిగిందో తెలియాలంటే.. సదరు అజ్ఞాతంలోని యువతి స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. ఆమె చెప్పేదాని మీదే కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంది. కాగా, జనవరి 1వ తేదీ తెల్లవారు జామున ఢిల్లీ కంజావాలా పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. రోడ్డుపై యువతి శవం నగ్నంగా పడి ఉందని దాని సారాంశం. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ రోడ్డుపై అంజలి శవాన్ని గుర్తించారు. ఆమె శవం కాళ్లు విరిగి, శరీరంలోని కొన్ని భాగాలు వీడిపోయి ఉన్నాయి. ఆమె శవానికి కొద్ది దూరంలోనే ఆమె స్కూటీని గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక, అంజలి తల్లిదండ్రులు దీన్ని నిర్భయ కేసుగా అభివర్ణిస్తున్నారు.
సదరు నిందితులు తమ కూతురిపై అత్యాచారం జరిపి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఓ ప్రత్యక్ష సాక్షి కూడా విస్తుపోయే విషయాలు కొన్ని చెప్పాడు. యువతిని నిందితులు ఉద్దేశ్యపూర్వకంగా కారులోకి లాక్కెళ్లారని, గంటన్నర యూటర్నులు తీసుకుంటూ 13 కిలోమీటర్లు చక్కర్లు కొట్టారని తెలిపాడు. స్కూటీపై తాను ఆ కారును వెంబడించానని, అరుస్తున్నా నిందితులు పట్టించుకోలేదన్నాడు. పోలీసులకు 20 సార్లు ఫోన్ చేసినా స్పందించలేదన్నాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#WATCH | Kanjhawala death case: CCTV footage of that night shows the presence of another girl with the girl who died after being dragged for a few kilometres by a car that hit her in Sultanpuri area.
(CCTV visuals confirmed by police) pic.twitter.com/nd1NUBQVze
— ANI (@ANI) January 3, 2023