గత 9 రోజుల నుంచి ఓ యువకుడు ఉన్నట్టుండి కనిపించకుండపోయాడు. దీంతో అతని తల్లిదండ్రులు కుమారుడికి అనేక సార్లు ఫోన్ చేశారు. అయినా ఆ యువకుడు స్పందించలేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ యువకుడి తల్లిదండ్రులు స్థానిక పరిసర ప్రాంతాల్లో అంతటా వెతికారు. కానీ, కుమారుడి జాడ మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక ఆ యువకుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత 9 రోజుల నుంచి వెతుకుతూనే ఉన్నారు. కట్ చేస్తే ఆ యువకుడి శవం వారి గ్రామంలోని వాటర్ ట్యాంక్ లో తేలింది. అదే నీటిని తాగిన గ్రామస్తులు ఈ విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు కడలూరు జిల్లా విరుధాచలం పరిధిలోని రాజేంద్ర పట్నం. ఇదే గ్రామంలో రాజకీయ నాయకుడి కుమారుడు శరవణ్ కుమార్ (34) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను బీటెక్ పూర్తి చేసి అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. అయితే శరవణ్ కుమార్ గతంలో సర్పంచ్ గా పోటి చేసి ఓటమిపాలయ్యాడని సమాచారం. ఇదిలా ఉంటే శరవణ్ కుమార్ గత 9 రోజుల నుంచి కనిపించకుండపోయాడు. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు అనేక సార్లు ఫోన్ చేశారు. అయినా స్పందించలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాని ఈ యువకుడి తల్లిదండ్రులు.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత 9 రోజుల నుంచి స్థానిక ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆ యువకుడి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి ఉన్నట్టుండి వారి గ్రామంలోని వాటర్ ట్యాంక్ నీళ్లు విపరీతమైన దుర్వాసన రావడం మొదలైంది. దీనిని గమనించిన కొందరు గ్రామస్తులు ఆ వాటర్ ట్యాంక్ లోకి తొంగి చూడగా.. అందులో శరవణ్ కుమార్ మృతదేహం కుళ్లిన స్థితిలో దర్శనిమిచ్చింది. ఇది తెలియని గ్రామస్తులు గత 9 రోజులుగా అవే నీటిని తాగుతూ వచ్చారు.
ఇక అసలు విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వాటర్ ట్యాంక్ లో ఉన్న ఆ యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు. అసలు రాజకీయ నాయకుడి కొడుకుని ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతుంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.