నేటికాలంలో వివాహ బంధాలకు విలువ లేకుండా పోతుంది. అందుకు నిదర్శనమే కొందరు చేసే పనులు. భార్యభర్తల బంధాన్ని నిట్టనిలువు తగలబెడుతూ.. పరాయి వారితో పడక సుఖాన్ని పంచుకుంటున్నారు. మరికొందరు అయితే మరీ దారుణంగా తమ కోరికలు తీర్చుకోవడానికి మైనర్ పిల్లలను కూడా ట్రాప్ చేస్తున్నారు. ఇలా చేసే వారిలో కొందరు మహిళలు కూడా ఉండటం గమన్హారం. అలాంటి ఘటనే ఇది. భర్త అనారోగ్యంగా ఉన్నడనే కారణంతో.. ఎదురింట్లో ఉన్న ఓ మైనర్పై కన్నేసింది ఓ నలుగురు పిల్లల తల్లి. అతనితో శారీరకంగా సంబంధం నడిపింది. ఆపై ఒక అడుగు ముందుకేసి.. ఏకంగా అతనితో కలిసి బతకాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అతన్ని ట్రాప్ చేసి.. ఊరు విడిచి పారిపోయింది. చివరికి సమాజంలో పరువు పోగొట్టుకుని, అరెస్టు అయింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఆమె పేరు స్వప్న, వయసు 30 ఏళ్లు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ లోని గుడ్ మెన్ పేటకు చెందిన ఈమెకు పెళ్లై నలుగురు పిల్లలు ఉన్నారు. భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడు వేరో చోట ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆంటీ.. ఆంటీ అంటూ ఎనిమిదో తరగతి చదువుతున్న ఎదురింటి బాలుడు.. స్వప్న ఇంటి వస్తుండే వాడు. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న స్వప్నలో కొంత కోరికలు పుట్టుకొచ్చాయి. రోజూ తన ఇంటికి వస్తున్న ఆ మైనర్ బాలుడిపై కన్నేసింది. ఎలాగైన ఆ బాలుడి తన కౌగిళ్లలో బంధించాలనుకుంది. అతడిని తన కోరికలు తీర్చుకోవాలని భావించింది. మాయ మాటలు ఎన్నో చెప్పి బాలుడిని తన ముగ్గులోకి దించింది. ఈ క్రమంలోనే అతనికి అశ్లీల వీడియోలు చూపించి.. శారీరకంగా లోబర్చుకుంది ఆమె.
అలా గుట్టు చప్పుడు కాకుండా నెల రోజులుగా ఆమె ఎంచక్కా ఆ మైనర్ బాలుడితో శారీరక కోరికలు తీర్చుకుంది. అంతటితో ఆగక ఆ బాలుడితోనే జీవితాంత జీవించాలనుకుంది. గుడివాడలోనే ఉంటే తన బండారం బయటపడుతుందని మకాం మార్చాలనుకుంది. తన భర్త, నలుగురు పిల్లలను వదిలేసింది. ఇద్దరం కలిసి బతుకుదామని, తన వెంట వచ్చేయమని మైనర్ని బలవంతం చేసింది. ఈ క్రమంలో భయం భయంగానే ఆమెతో పాటు ఈ నెల 19న హైదరాబాద్ వచ్చేశాడు బాలుడు. అక్కడే బాలానగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆ బాలుడితో గడిపింది. ఈ క్రమంలో మైనర్ తండ్రి గత సోమవారం పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు స్వప్న కూడా కనిపించపోయేసరికి.. అనుమానాలు మొదలయ్యాయి.
ఈక్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారిద్దరు హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేసి వారిద్దరినీ గుడివాడ తీసుకొచ్చారు. స్వప్నను బుధవారం గుడివాడ కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆమెకు రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. ఆ మైనర్ బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. అయితే గుడివాడ టూటౌన్ పోలీసులు ఈ కేసు ఛేదించిన విషయం.. వారిద్దరినీ గుడివాడ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని బాలానగర్ సీఐ భాస్కర్ చెప్పడం గమనార్హం. మరి.. వివాహిత స్వప్న నడిపిన ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.