వివాహేతర, అక్రమ సంబంధాలు వంటివి నేరాలకు కారణాలవుతున్నాయి. పెళ్లై, పిల్లులున్న స్త్రీ, పురుషులు పరాయి వ్యక్తుల మోజులో పడి.. కుటుంబ సభ్యులను పట్టించుకోవడం లేదు. అదే సమయంలో సహజీవనంలో కూడా దారుణాలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధంలో ఉన్న వ్యక్తులు కూడా తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సవ్యంగా సాగిపోతున్నంత కాలం ఏమీ ఉండదు కానీ,
వివాహేతర, అక్రమ సంబంధాలు వంటివి ఘోరమైన నేరాలకు కారణాలవుతున్నాయి. పెళ్లై, పిల్లులున్న స్త్రీ, పురుషులు పరాయి వ్యక్తుల మోజులో పడి.. కుటుంబ సభ్యులను కల్లు గప్పి.. రాసలీలు సాగిస్తున్నారు. అదే సమయంలో సహజీవనంలో కూడా దారుణాలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధంలో ఉన్న వ్యక్తులు కూడా తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సవ్యంగా సాగిపోతున్నంత కాలం ఏమీ ఉండదు కానీ, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో చావడానికి, చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఎటువంటి నేర ప్రవృత్తి లేని వారూ కూడా ఈ అక్రమ సంబంధాలలో వలలో పడి నేరస్థులుగా మారిపోతున్నారు. ఓ పూజారి విషయంలో ఇదే జరిగింది.
హైదరాబాద్, శంషాబాద్-సరూర్ నగర్ లో ఘోరం జరిగింది. అప్సర అనే యువతిని బండ రాయితో కొట్టి చంపేశాడో పూజారి. చంపేశాక.. అతడే.. ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు.. అతడిని విచారించగా.. పూజారే హతమార్చాడని తేలింది. వివరాల్లోకి వెళితే.. సరూర్ నగర్కు చెందిన వెంకటేశ్వర కాలనీలో సాయికృష్ణ (36) అనే వ్యక్తి సమీపంలోని గుడిలో పూజారిగా పనిచేస్తున్నాడు. అతడికి వివాహమైంది. అదే ప్రాంతంలో ఉంటున్న అప్సర అనే యువతితో అతడికి పరిచయమైంది. వీరికి వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే అతడిని పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి తీసుకువస్తుండటంతో.. ఆమెను చంపేయాలని భావించాడు. ఈ నెల 3వ తేదీన ఇద్దరు శంషాబాద్ వద్దకు వెళ్లగా.. ఆమె తలపై బండరాయితో బలంగా కొట్టాడు పూజారి. దీంతో అప్సర అక్కడిక్కడే చనిపోయింది.
అనంతరం ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి.. తమ నివాస ప్రాంతమైన సరూర్ నగర్లో తహశీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న మ్యాన్ హోల్ పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత ఏమీ ఎరగన్నట్లు శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఆమెకు బంధువునని .. అప్పర ఈ నెల 3 నుండి కనిపించడం లేదంటూ పేర్కొన్నాడు. అయితే విచారణలో అతడికి, అప్సరకు ఎటువంటి సంబంధం లేదని తేలిన తర్వాత.. సాయి కృష్ణను తమదైన స్టైల్స్ లో విచారించగా.. తాను హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో.. చంపేసినట్లు నేరం అంగీకరించారు. ఆమె మృతదేహాన్ని అధికారులు వెలికి తీస్తున్నారు. అయితే అప్సర.. ఓ తమిళ సినిమాలో కనిపించిందని తల్లి చెబుతున్నారు. సినిమాల్లో నటించడం ఇష్టం లేక తిరిగి హైదరాబాద్ కు మకాం మర్చామని చెబుతున్నారు.