సరూర్ నగర్లో అప్సర అనే యువతి హత్య కేసు హైదరాబాద్ నగరం మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. ఓ పూజారి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడా అనే విషయాన్ని చాలా మంది జీర్ణించుకోలేక పోతున్నారు. మంచిగా ఉంటూ.. గుడిలో పూజలు చేసుకునే సాయి కృష్ణ అనే పురోహితుడు.. పక్కా ప్రణాళికతో.. కిల్లర్ను మించిపోయేలా యువతిని హత్య చేయడం గగొర్పాటుకు గురి చేస్తోంది.
సరూర్ నగర్లో అప్సర అనే యువతి హత్య కేసు హైదరాబాద్ నగరం మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. ఓ పూజారి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడా అనే విషయాన్ని చాలా మంది జీర్ణించుకోలేక పోతున్నారు. మంచిగా ఉంటూ.. గుడిలో పూజలు చేసుకునే సాయి కృష్ణ అనే పురోహితుడు.. పక్కా ప్రణాళికతో.. కిల్లర్ను మించిపోయేలా యువతిని హత్య చేయడం గగొర్పాటుకు గురి చేస్తోంది. వివాహేతర సంబంధమే అప్సర ప్రాణం పోయేలా చేసిందని పోలీసులు చెబుతున్నారు. పెళ్లి చేసుకోమని చెప్పడంతోనే ఆమెను చంపేసినట్లు నిందితుడు అంగీకరించాడని పేర్కొన్నారు. కాగా, కుమార్తె చనిపోయిందన్న వార్త తెలిసి అప్సర తల్లి ఖిన్నురాలయ్యింది. నిందితుడైన సాయి కృష్ణ గురించి విస్తుపోయే విషయాలు వెల్లడించింది.
అప్సర తల్లి ఏం చెప్పారంటే.. సాయి కృష్ణ అంతటి ఘాతుకానికి ఒడిగడతానని తాను అస్సలు అనుకోలేదని బాధపడింది. తాము గతంలో చెన్నైలో ఉండేవాళ్లమని, తన కుమార్తె 15 ఏళ్ల క్రితం ఓ తమిళ సినిమాలో నటించిందని అన్నారు. అయితే తమకు సినిమా ఫీల్డ్ ఇష్టం లేకపోవడంతో తిరిగి హైదరాబాద్ వచ్చి సరూర్ నగర్లో ఉంటున్నామని చెప్పారు. తన భర్త కాశీలో ఉంటాడని, అక్కడి నుండి డబ్బులు పంపిస్తే.. తామిద్దరం బతుకుతున్నట్లు తెలిపింది. అయితే సరూర్ నగర్లో ఉంటున్న పూజారి సాయి కృష్ణతో గుడికి వెళ్లే క్రమంలో అప్సరకు పరిచయం ఏర్పడిందని, తమ ఇంటికి కూడా వస్తుంటాడని వెల్లడించింది తనను అక్కయ్య అని పిలుస్తుంటాడని పేర్కొంది. అంతే తప్ప.. తమకు, సాయి కృష్ణ కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదని చెప్పింది. ఇంటికి వచ్చినప్పుడు అక్కయ్యా అంటూ ఆప్యాయంగా మాట్లాడేవాడని, భోజనం కూడా చేశావాడంటూ తెలిపింది.
వాళ్లిద్దరి మధ్య స్నేహం ఉందని అనుకున్నా కానీ.. ఇలాంటి సంబంధం ఉందని తనకు తెలియదని అన్నారు. అతడికి పెళ్లి అయ్యి, పిల్లలు కూడా ఉండటం, పురోహితుడిగా మంచి పేరు ఉండటంతో వీరి రిలేషన్ గురించి అనుమానించలేదని అన్నారు. జూన్ 3వ తేదీన కూడా కోయంబత్తూరుకు వెళుతున్నామని బయలుదేరిన కూతురు.. ఎటువంటి కాల్ చేయలేదు. తరువాత రోజు ఇంటికి వచ్చిన సాయి కృష్ణ.. భద్రాచలానికి తన స్నేహితులతో పంపిచానని చెప్పాడు. ‘నువ్వెవడిరా నా కూతురును పంపించడానికి, నీకేం రెస్పాన్సిబులిటీ ఉంది. ఎక్కించేటప్పుడు నాకెందుకు కాల్ చేయలేదు’అని అడిగే సరికి నీళ్లు నమిలాడు. అయితే పోలీసులకు కూడా అప్సర కనిపించడం లేదంటూ అతడే ఫిర్యాదు చేశాడు. ఆమె పోలీసులకు ఫోన్ చేసి అడిగితే.. వెతుకుతున్నామని చెప్పారన్నారు.
అప్పర ఫ్రెండ్స్ అయితే తనకు తెలుసునని, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిద్దామని అనే సరికి పోలీసులు అతడిపై అనుమానం వ్యక్తం చేశారన్నారు. మంచిగా ఉంటూ..అక్కయ్య, అక్కయ్య అని పిలుస్తూ.. ఓ పూరోహితుడు ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదని అన్నారు. తర్వాత అతడే చంపేంత కర్కోటకుడని నమ్మలేదని అన్నారు. అలా ఎలా చంపగలిగాడండీ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం.. తమ మధ్య వివాహేతర సంబంధం ఉందని, ఆమె గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో చంపేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులకు వెల్లడించారు. శంషాబాద్కు కారులో వెళ్లామని, ఆ తర్వాత బండరాయితో కొట్టి చంపి.. శవాన్ని కారులో సరూర్ నగర్ కు తీసుకువచ్చి.. తహశీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న మ్యాన్ హోల్ లో పడేసినట్లు నేరాన్ని అంగీకరించడని పోలీసులు వెల్లడించారు.