న్న చిన్న సమస్యలకే మనో స్థైర్యాన్ని, ధైర్యాన్ని కోల్పోతున్నారు కొంత మంది. ముఖ్యంగా విద్యార్థి దశలోనే రాలిపోతున్న కుసుమాలు ఎన్నో. ప్రేమలు, లేదా మార్కులు, ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది.
బాల్యం, యవ్వనం ప్రతి మనిషికి అందమైన దశ. బుడి బుడి అడుగులు వేస్తూనే తప్పటడుగులు పడినా.. సరిదిద్దుకుంటూ నడవడమే కాదూ పరుగులు కూడా పెడుతుంటాం. ఈ సూత్రమే జీవితానికి కూడా వర్తిస్తుంది. చిన్న చిన్న సమస్యలకే మనో స్థైర్యాన్ని, ధైర్యాన్ని కోల్పోతున్నారు కొంత మంది. ముఖ్యంగా విద్యార్థి దశలోనే రాలిపోతున్న కుసుమాలు ఎన్నో. ప్రేమలు, లేదా మార్కులు, ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. పాఠాలు చెబుతున్న విద్యాలయాల్లో విద్యార్థుల పట్ల యమ కింకురులుగా మారుతున్నాయి. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటిలో ట్రిపుల్ ఐటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మరో విద్యార్థిని ప్రమాదవ శాత్తు మరణించిన సంగతి విదితమే.
తాజాగా తెలంగాణలో మరో విద్యార్థిని బలైంది. నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే. జిల్లాలోని మెండోరా మండల కేంద్రానికి చెందిన గోలి రక్షిత.. ఆర్మూర్ పట్టణంలోని నరేంద్ర ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. స్థానికంగా ఉన్న ఎస్సీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. ఆ రోజు కూడా కాలేజీ వెళ్లి తిరిగి వచ్చిన రక్షిత.. రాత్రి అందరితో భోజనం చేయడానికి సిద్ధమైంది. తన ప్లేట్ తీసుకుని మళ్లీ తింటానని చెప్పి గదిలోకి వెళ్లింది రక్షిత. గదిలో తలుపులు వేసుకుని ఎంతకూ బయటకు రాకపోవడంతో రూమ్ మేట్స్ ఫోన్ చేశారు.
ఫోన్ తీయలేదు. దీంతో భయం వేసి.. వార్డెన్ ఫర్జానాకు సమాచారం అందించారు. ఆమె కిటికీలోంచి చూడగా ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగుల గొట్టి ఆమెను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడికి తీసుకెళ్లగా.. ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.