హత్యల్లో అత్యధికంగా నగదు, ఆస్తులు, అంతస్థులు, వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్నవే. ముఖ్యంగా వివాహేతర సంబంధం కారణంగా రెండు జీవితాలే కాదూ.. కుటుంబాలకు కుటుంబాలు నాశనమౌతున్నాయి. భార్యా భర్తల సంబంధంలోకి మూడవ వ్యక్తి చొరవ.. కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తోంది.
ఇటీవల జరుగుతున్న నేరాలు-ఘోరాలు చూస్తుంటే విడ్డూరంగానూ, వింతగానూ, ఆందోళగానూ, భయంగానూ అనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఈ హత్యల్లో అత్యధికంగా నగదు, ఆస్తులు, అంతస్థులు, వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్నవే. ముఖ్యంగా వివాహేతర సంబంధం కారణంగా రెండు జీవితాలే కాదూ.. కుటుంబాలకు కుటుంబాలు నాశనమౌతున్నాయి. భార్యా భర్తల సంబంధంలోకి మూడవ వ్యక్తి చొరవ.. కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తోంది. పెళ్లైందని, పిల్లలున్నారని తెలిసి కూడా అతడితో ప్రేమలో పడుతున్నారు కొందరు యువతులు. వారితో మరో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నారు. దీని వల్ల చేసుకున్న భార్యను చిత్ర హింసలకు గురి చేస్తున్నారు.
ఇదే వివాహేతర సంబంధం ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా దేవరకొండలోని మైనం పల్లి గ్రామ పంచాయతీలో కొర్ర తండాకు చెందిన నేనావతి చిన్ని, విజయ్ అనే వ్యక్తి ప్రేమించుకున్నారు. కాగా, విజయ్కు గతంలో భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈ విషయం చిన్ని ఇంట్లో తెలియడంతో ఆమెకు వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు తండ్రి. కానీ అంతలో ఆచూకీ కానరాలేదు. విజయ్ని ప్రశ్నించగా..తనకేమీ తెలియదని, తల్లిదండ్రుల సంబంధం చూసి పెళ్లి చేసుకోవాలని చెప్పినట్లు తెలపడంతో.. చిన్ని కోసం వెతక సాగారు. అంతలో ఓ బావిలో ఆమె మృతదేహం కనిపించింది. దీంతో విజయ్ ఈ హత్య చేసి చివరకు ఆత్మహత్య చేసుకున్నట్లు క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.