పెరిగి పెద్దయ్యాక పిల్లలు తల్లిదండ్రులను మర్చిపోతున్నారు. తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడకుండా వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు వేరు కాపురాలంటూ తల్లిదండ్రులకు దూరంగా బతుకుతున్నారు. వృద్ధాప్యంలో ఆదరణగా ఉంటారునుకున్న పిల్లలు.. ఆస్తులు పంచే వరకు ఒకలాగా, రాసేశాక మరోలా ప్రవర్తిస్తున్నారు.
పిల్లల్ని కని..అల్లారు ముద్దుగా పెంచుకుంటారు తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి వారికి కావలసినవి సమకూర్చి, వారి కొరకు రాత్రిపగలు కష్టపడి పెంచిపోషిస్తారు. సమాజంలో తమ పిల్లలను ఉన్నతస్థాయిలో చూడాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. కానీ నేటి సమాజంలో జరుగుతున్న తీరు వేరు. పెరిగి పెద్దయ్యాక పిల్లలు తల్లిదండ్రులను మర్చిపోతున్నారు. తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడకుండా వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు వేరు కాపురాలంటూ తల్లిదండ్రులకు దూరంగా బతుకుతున్నారు. వృద్ధాప్యంలో ఆదరణగా ఉంటారునుకున్న పిల్లలు.. ఆస్తులు పంచే వరకు ఒకలాగా, రాసేశాక మరోలా ప్రవర్తిస్తున్నారు. అయితే పిల్లలు కారణంగా మనో వేదనకు గురై అనారోగ్యం బారిన పడి మరణిస్తారు. చివరకు కన్నవారి కడచూపు చూడటానికి రావడం లేదు. ఇదే జరిగింది ఆ దంపతుల విషయంలో.
కుమారులున్నా.. అనాధలుగా మారారు. భర్త చనిపోవడంతో కుమారులతో తలకొరివి పెట్టించడం ఇష్టం లేని ఇల్లాలు.. ఇంట్లోనే దహనం చేసేసింది. ఈ విస్తుగొల్పే ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో హరికృష్ణ ప్రసాద్, లలిత దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులున్నారు. పెద్దకుమారుడు దినేశ్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్యోగి. చిన్న కుమారుడు ముఖేశ్ కెనడాలో స్థిరపడ్డాడు. గత 15 సంవత్సరాల నుండి హరికృష్ణ ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భార్య లలిత ఆయనకు సపర్యలు చేస్తుంది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం హరికృష్ణ మంచంపై అచేతనంగా ఉండడంతో చనిపోయినట్లు భార్య లలిత గుర్తించింది. సహాయం కోసం ఎవరిని పిలవకుండా ఇంట్లోనే భర్త దహనసంస్కరాలు చేసే ప్రయత్నం చేసింది.
సోమవారం ఉదయం వీరి ఇంటినుండి పొగలు రావడంతో చుట్టుపక్కల వారు చూసి.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వచ్చి పరిశీలించారు. అప్పటికే బాడీ 80 శాతం కాలిపోయింది. భార్య లలితను విచారించగా.. తన భర్త సోమవారం ఉదయం చనిపోయినట్లు లలిత తెలిపింది. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నట్లు, వారు ఆస్తి కోసమే తమ వద్దకు వస్తారని తెలిపింది. వారు తన భర్త చనిపోయాడని తెలిస్తే ఆస్తి కోసం గొడవ చేస్తారని.. ఇంట్లోనే అట్టపెట్టెలతో దహన సంస్కారాలు చేశానని లలిత చెప్పింది.కానీ స్థానికులు, కొడుకులు ఇచ్చిన సమాచారం మేరకు భార్య లలితకు మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసులు గుర్తించారు.