దంపతులు మధ్య రాజుకున్న వివాదం కూర్చుని చర్చించుకుంటే సరిపోతుంది కానీ.. ఇగో, ఇతర కారణాలతో ఎడ మొహం, పెడ మొహంగా ఉంటూ సమస్యను మరింత పెద్దది చేసుకుంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఎడబాటు పెరిగిపోతుంది.
భార్యా భర్తల మధ్య చిన్నచిన్న గొడవలు.. పెద్ద తుఫానుగా మారుతున్నాయి. ఇవి వారికి పుట్టిన పిల్లలపై కూడా ప్రభావాన్ని చూపుతున్నాయి. దంపతులు మధ్య రాజుకున్న వివాదం కూర్చుని చర్చించుకుంటే సరిపోతుంది కానీ.. ఇగో, ఇతర కారణాలతో ఎడ మొహం, పెడ మొహంగా ఉంటూ సమస్యను మరింత పెద్దది చేసుకుంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఎడబాటు పెరిగిపోతుంది. చిన్న విషయానికే భార్యపై అంతెత్తు ఎగరడం, లేదా భర్తపై అరవడం వంటి దృశ్యాలు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. దీంతో భార్యపై చేయిచేసుకోవడం, భర్త కొట్టాడని భార్య అఘాయిత్యాలకు పాల్పడం జరుగుతున్నాయి. అయితే ఇందులో పిల్లలు కూడా బలౌతున్నారు. భర్తపై కోపంతో ముద్దులొలికే ఇద్దరు చిన్నారులను హతమార్చి.. ఆమె ఆత్మహత్యకు యత్నించిందో ఇల్లాలు.
ఈ ఘటన కర్ణాటకలోని జరిగింది. భార్యా భర్తలు ఇద్దరు ఉద్యోగస్థులు. కానీ అనవసరమైన విషయాల్లో ఏర్పడ్డ పొరపచ్ఛాలు, మనస్పర్థలుగా మారి చివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయేలా చేశాయి. వివరాల్లోకి వెళితే.. గిరనహళ్లికి చెందిన సుగుణకు కోలార్ తాలూకాలోని ఉప్పకుంటె గ్రామానికి చెందిన మురళీతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ ప్రభుత్వ రవాణా సంస్థ కోలార్లో పనిచేస్తున్నారు. మురళీ సెక్యూరిటీ గార్డుగా, భార్య సుగుణ డిపోలో మెకానిక్గా పనిచేస్తున్నారు. వీరికి 9 ఏళ్ల ప్రీతంగౌడ, 6 ఏళ్ల నిషితగౌడ పిల్లలు ఉన్నారు. అయితే భార్యా భర్తల మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల సుగుణ తండ్రి చనిపోవడంతో పుట్టింటికి కుటుంబ మొత్తం వెళ్లింది. తిరిగి వచ్చాక.. నిద్ర పోయిన భర్త మురళీని లేపింది.
పిల్లల హోంవర్క్ విషయంలో అతడితో గొడవపడింది. దీనిపై ఇద్దరి మధ్య వాదన జరిగింది. దీంతో అతడు భార్యపై చేయి చేసుకున్నాడు. ఇక మరుసటి రోజు యథావిధిగా అతడు డ్యూటీకి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిన వెంటనే ఇద్దరు పిల్లలను హతమార్చి.. తల్లి ఆత్మహత్యచేసుకుంది. ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. ఆమె బలవన్మరణానికి పాల్పడింది. అంతకముందు సోదరుడికి వాట్సప్ సందేశాన్నిపంపింది. అదేవిధంగా డెత్ నోట్ కూడా రాసింది. తన చావుకు అత్త, భర్త కారణమంటూ ఆత్మహత్య లేఖలో పేర్కొంది. ఆ తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడింది. ముగ్గురు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి చుట్టు ప్రక్కల వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదైంది. ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. భర్తను విచారిస్తున్నారు.