హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. గన్ క్లీన్ చేస్తుండగా అది మిస్ ఫైర్ అయి కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయి ఓ కానిస్టేబుల్ కు తీవ్రంగా గాయ పడ్డాడు. వెంటనే స్పందించిన తోటి ఉద్యోగులు.. అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో అతడు అప్పటికే ప్రాణాలు విడాచారని నిర్ధారించుకున్నారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. దీంతో పాటు అతని తోటి ఉద్యోగులు సైతం శోక సంద్రంలో మునిగిపోయారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన రామయ్య అనే వ్యక్తి తెలంగాణ సెక్రటేరియట్ వెనుక భాగంలో ఉన్న మింట్ కంపౌండ్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, గురువారం ఉదయం ఎస్ఎల్ఆర్ గన్ క్లీన్ చేస్తుండగా అది మిస్ ఫైర్ అయి రామయ్య ఛాతిలోకి దూసుకెళ్లింది. తోటి ఉద్యోగులు వెంటనే స్పందించి చూడగా అతడు అప్పటికే మరణించాడని ఆ తర్వాత నిర్ధారించుకున్నారు. ఇదే విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనంతరం పోలీసులు రామయ్య మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనపై స్పందించిన పోలీసులు మొదటగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. విచారణ చేపట్టిన అనంతరం ఇది ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు తెలిపారు.