రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో చెడ్డీ గ్యాంగ్ ముఠాలు భయపెడుతూనే ఉన్నాయి. తాజాగా విజయవాడలో సైతం చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేస్తూ నగర ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నాయి. అయితే తాజాగా గుంటుపల్లి ప్రాంతంలో ఈ ముఠా సంచరించినట్లు సీసీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. ముందుగా అర్థరాత్రి 2 గంటల సమయంలో నలుగురు అయిదుగురితో కూడిన ఈ చెడ్డీ గ్యాంగ్ పెద్ద పెద్ద కర్రలతో పాటు కొన్ని మారణాయుధాలతో ఓ స్థానిక అపార్ట్ మెంట్ లోకి వెళ్లారు. వీరి రాకను గమనించిన కొందరు కుటుంభికులు భయంతో వణికిపోయారు.
కొందరు యువకులు ధైర్యం చేసి ముందుకు అడుగేశారు. లైట్లతో వారిని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ఆ లైట్ వెలుగులను చూసిన ఆ చెడ్డీ గ్యాంగ్ వెంటనే పరుగులు తీశారు. అలా మెల్లగా అపార్ట్ మెంటులోకి ప్రవేశించి తిరిగి వస్తున్న దృశ్యాలు ఆ అపార్ట్ మెంట్ సీసీ ఫుటేజీలో ఈ భయానక దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలు చూసిన ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దీంతో వెంటనే కొంతమంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం వేట మొదలు పెట్టారు. తాజాగా చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేస్తుండడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు సూచించారు.
— Uppula Naresh (@UppulaNaresh72) December 3, 2021