నేటి కాలం యువత తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిళ్ల కంటే ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటున్నారు. ప్రేమించినవారితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోయినా ఎదురించి మరీ వివాహం చేసుకుంటున్నారు. ఇక చేసుకున్నాక సంతోషంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. ప్రతీ చిన్న విషయానికి గొడవ పడుతూ మనస్పర్థలతో చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి గ్రామం. ఇక్కడే యశ్వంత్ రెడ్డి అనే యువకుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే యశ్వంత్ ఇదే గ్రామానికి చేందిన తేజశ్రీ (19) అనే యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా ఇతడిని ప్రేమించింది. ఇద్దరూ కొంత కాలం పాటు ప్రేమ విహారంలో తేలియాడుతూ సినిమాలు. షికారులు అంటూ తిరిగారు. ఇక చివరికి పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో వీరికి ఏం చేయాలో తెలియక అక్టోబర్ 19 ఓ గుడిలో కులాంతర వివాహం చేసుకున్నారు. అనంతరం మాకు రక్షణ కావాలంటూ ఇద్దరూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను పిలిచి కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత యశ్వంత్ రెడ్డి ఉండేందుకు తుప్రాన్ లో ఓ గదిని అద్దెకు కూడా తీసుకున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. పెళ్లైన మరుసటి రోజు నుంచే యశ్వంత్ రెడ్డి తేజశ్రీని వదిలి వెళ్లిపోయాడు. రెండు మూడు రోజులైన యశ్వంత్ రెడ్డి తేజశ్రీ వద్దకు తిరిగి రాలేదు. దీంతో ఆ యువతి ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది.
వెంటనే యువతి తల్లిదండ్రులు, బంధువులు కలిసి యశ్వంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంలో ఆ యువతికి న్యాయం మాత్రం జరగలేదు. దీంతో పెళ్లైన మరుసటి రోజు నుంచే పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇలా చేయడంతో తేజశ్రీ తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇక ఇలాంటి బతుకు నాకొద్దు అనుకున్న తేజశ్రీ నవంబర్ 18న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో వెంటనే స్పందించిన తేజశ్రీ తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన తేజశ్రీ పరిస్థితి విషమించడంతో ఇటీవల ప్రాణాలు కోల్పోయింది. కూతురు చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో ఆ యువతి మృతదేహాన్ని యశ్వంత్ రెడ్డి ముందు ఉంచి తమకు న్యాయం చేయాలని తేజ శ్రీ బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు వారిని సముదాయించి నిందితుడిని వెంటనే అరెస్ట్ చేస్తామని హామి ఇచ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. చూశారుగా.. ఈ ఘటనలో యశ్వంత్ చేసిన దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.