మద్యం కేసులో అరెస్ట్ అయిన భర్తను ఇంటికి తీసుకు రావాలనే ప్లాన్ లో ఓ భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి నానా హంగామా సృష్టించింది. తాజాగా బీహార్ లో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది బీహార్ లోని జముయ్ జిల్లా సికంద్రా. ఇదే ప్రాంతానికి చెందిన కార్తీక్, సంజు దేవి ఇద్దరు భార్యాభర్తలు. భార్య సంజు దేవి దుర్గామాత తనలో అవాహించినట్టు గ్రామంలో జనాలను నమ్మించింది. దీంతో ప్రజలందరూ ఆమెను పూజిస్తూ వస్తున్నారు.
అయితే సంజు దేవి భర్త కార్తీక్ ను ఇటీవల పోలీసులు మద్యం కేసులో అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న భార్య హుటాహుటిన పోలీసు స్టేషన్ కు వెళ్లింది. వెంటనే నా భర్తను విడిచి పెట్టాలని స్టేషన్ ముందు నానా హంగామా సృష్టించింది. మర్యాదగా నా భర్తను విడిచి పెట్టండి, లేకుంటే మీరంతా తర్వాత బాధపడాల్సి ఉంటది అంటూ పోలీసులను హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Sri Sathya Sai: ప్రేమ పేరుతో దారితప్పారు. సహజీవనం చేస్తూ కుటుంబాల్లో చిచ్చుపెట్టారు!
ఇక ఇంతటితో ఆగకుండా నేను దుర్గా మాతను అంటూ పోలీస్ స్టేషన్ ఆవరణలో, పోలీసు అధికారులపై అన్నం చల్లుతూ డ్రామా చేయడం ప్రారంభించింది. మహిళ హై డ్రామాను తట్టుకోలేనీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని భర్త అరెస్ట్ పై వివరించారు. అనంతరం ఆ మహిళకు నచ్చచెప్పిన పిమ్మట అక్కడి నుంచి ఆ మహిళను సాగనంపారు. తాజాగా బీహార్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.