బిహార్ లో దారుణం చోటు చేసుకుంది. వరుసకు చెల్లిలు అయ్యే అమ్మాయిపై సోదరులు కీచక పర్వానికి తెర తీశారు. చెల్లెలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి అదే వీడియోలతో బ్లాక్ మెయిల్ కు దిగుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. బిహార్ లోని శిఖర్పుర్ పరిధిలోని దియులియా. ఇదే గ్రామంలో ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే వరసకు సోదరులు అయ్యే మహ్మద్ ఫైజ్, మహ్మద్ రాజన్ ఇద్దరూ ఎప్పటి నుంచో ఆ బాలికపై కన్నేసి ఉంచారు. ఒంటరిగా కనిపిస్తే కాటేసేందుకు పగబట్టిన నాగు పాములా రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మొహరం పండగ నేపథ్యంలో తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. అప్పుడు ఇంట్లో ఆ బాలిక ఒంటరి కనిపించింది. ఇదే అదునుగా భావించిన ఈ దుర్మార్గులు కాలు దువ్వి గోడెక్కి ఇంట్లోకి ప్రవేశించారు.
గతంలో ఆ బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీశారు. అదే వీడియోలు ఆ బాలికకు చూపించారు. ఆ వీడియోలు చూసిన ఈ బాలిక ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇక లైంగిక దాడికి ఒప్పుకోవాలని, లేకుంటే నీ వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని సోదరిని బెదిరించి అత్యాచారం చేశారు. దీనిని భరించలేని ఆ మైనర్ బాలిక పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసింది. ఆ బాలిక ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ నిందుతుడిని అరెస్ట్ చేయగా మరో నిందితుడి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇలా వరసకు సోదరి అయ్యే బాలికపై సోదరులు అత్యాచారం చేయడంపై స్థానికంగా ఈ అంశం తీవ్ర కలకలంగా మారింది. వరసకు చెల్లెలు అయ్యే బాలికపై అత్యాచారం చేసిన ఈ దుండగులకు ఎలాంటి శిక్ష సరైనది? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: 19 ఏళ్ల కుర్రాడితో 30 ఏళ్ల మహిళ జంప్.. రక్షించాలంటూ HRCని ఆశ్రయించిన తండ్రి!