వాళ్లిద్దరూ స్నేహితులు. రాను రాను ప్రేమికులిగా మారారు. చివరికి పెద్దలను ఎదురించి పెళ్లి కూడా చేసుకున్నారు. కట్ చేస్తే.. పెళ్లైన కొంత కాలానికి భర్త డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. మరో దారుణం ఏంటంటే? ఇటీవల భర్త తన ఫ్రెండ్ తో చేతులు కలిపి ఓ రోజు రాత్రి భార్యపై నీచానికి ఒడిగట్టాడు. తాజాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కొంత కాలం పాటు ప్రేమ విహారంలో తేలియాడారు. ఇక రాను రాను ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారిపోయారు. చివరికి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ, యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అనుకున్నట్లుగానే పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. అలా కొంత కాలం పాటు బాగానే సంసారం చేశారు. అయితే రాను రాను భర్త రాక్షసుడిలా మారాడు. డ్రగ్స్ కు అలవాటు పడి భార్యను తరుచు వేధింపులకు గురి చేసేవాడు. అంతేకాకుండా ఇటీవల ఓ రోజు రాత్రి తన ఫ్రెండ్ తో చేతులు కలిపి భార్యపై నీచానికి దిగాడు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రం ముజఫర్పూర్ జిల్లా మోతీపూర్ పరిధిలోని కుషాహి గ్రామం. ఇక్కడే ఆకాష్, కాజల్ అనే యువతి, యువకుడు ఉండేవారు. ఇద్దరికీ ముందుగానే కాస్త పరిచయం ఉండేది. ఆ పరిచయమే రాను రాను ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ ప్రేమించుకుని ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తయారయ్యారు. చివరికి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ, యువతి తల్లిదండ్రులు దీనికి అంగీకరించలేదు. అయినా సరే ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇక అనుకున్నట్టుగానే యువతి, యువకుడు 6 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. అలా కొంత కాలానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించి కూతురికి దగ్గరయ్యారు. ఆ తర్వాత కాజల్ తండ్రి తన ఆస్తిని అమ్మి అల్లుడు ఆకాష్ కు ఓ కారును బహుమతిగా ఇచ్చాడు.
అంతేకాకుండా కూతురికి విలువైన బంగారం అభరణాలు చేయించాడు. దీంతో ఆకాష్, కాజల్ దంపతులు మురిసిపోయారు. అలా కొన్ని నెలలు గడిచింది. ఆకాష్ మెల్ల మెల్లగా డ్రగ్స్ కు అలవాటు పడి భార్యను వేధింపులకు పాల్పడేవాడు. అంతేకాకుండా అదనపు కట్నం తేవాలంటూ భార్యను టార్చర్ పెట్టాడు. దీనిపై కాజల్ తల్లిదండ్రులు స్పందించి అనేకసార్లు అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసేవారు. అయినా వినని ఆకాష్.. అదే పనిగా భార్యను వేధిస్తూ ఉండేవాడు. ఇదే విషయంపై భార్యాభర్తలు తరుచు గొడవలు కూడా పడేవారు. ఈ క్రమంలో పట్టరాని కోపంతో ఊగిపోయిన ఆకాష్.. ఎలాగైనా భార్య కాజల్ ను చంపాలని అనుకున్నాడు.
అందుకోసం తన ఫ్రెండ్ సాయం తీసుకున్నాడు. అయితే ఇటీవల ఓ రోజు రాత్రి ఆకాష్ తన స్నేహితుడిని ఇంటికి పిలిచాడు. ఇక ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి కాజల్ ను దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.