అమెరికాలోనే బాల్టిమోర్ కు దగ్గరలోని ఈస్ట్ కోస్ట్ సిటీలో ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.ఈస్ట్ కోస్ట్ కి చెందిన నికోల్ జాన్సన్ అనే ఒక మహిళ ఇటీవల కాలంలో ఒక పని మీద కారులో ప్రయాణం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమె కారును ఆపి డ్రైవింగ్ లైసెన్సు అలాగే సంబంధించిన కొన్ని వివరాలను అడగగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వకుండా కొంచెం వింతగా ప్రవర్తించింది. అంతే కాకుండా నేను ఒక ఐదు రోజుల్లో సంచలనంగా మారిపోతాను అంటూ ఆమె పోలీసులకు తెలిపింది.
ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు కారు ను తనిఖీ చేయగా కారులో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారుల మృత దేహాలు కనిపించాయి. వారిలో అటువంటి దారుణమైన స్థితిలో మృతదేహాన్ని చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఆ పిల్లలను ఎందుకు చంపావని పోలీసులు ఆమెను ప్రశ్నించగా, ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. కానీ ఆ పిల్లలు తన బంధువులేనని ఆమె తెలిపింది.
అత్యంత కిరాతకంగా చంపి వారిని కారు డిక్కీలో వేసుకొని నెలలపాటు పెట్టుకుంది. ఐదేళ్ల మేనల్లుడు, అలాగే ఏడేళ్ల మేనకోడలు ఇద్దరూ తన అక్క దగ్గర నుంచి ఆ మహిళ వద్దకు వచ్చినట్లు తెలిపింది. ఆ పిల్లలను చూసిన పోలీసులు ఆమె అత్యంత కిరాతకంగా చంపినట్లు ప్రాథమికంగా నిర్దారించారు. అయితే కారులో నెలపాటు మృతదేహాలు ఉన్నా కూడా పోలీసులు ఇన్ని రోజులు ఎందుకు ఆ కారణం తనిఖీ చేయకుండా ఉన్నారు అనే ప్రశ్న ఎదురవుతుంది. అంతేకాకుండా ఆ పిల్లలను ఎందుకు హత మార్చింది అనేది ఇంకా తెలియలేదు.