నవ మాసాలు మోసి పురిటి నొప్పుల బాధ భరించి బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది తల్లి. పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో కలలకంటూ పిల్లలే లోకంగా బతుకుతుంది. తల్లి బిడ్డను లాలిస్తూ బుజ్జగిస్తూ అల్లారు ముద్దుగా పెంచుతుంది.
నవ మాసాలు మోసి పురిటి నొప్పుల బాధ భరించి బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది తల్లి. పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో కలలకంటూ పిల్లలే లోకంగా బతుకుతుంది. తల్లి బిడ్డను లాలిస్తూ బుజ్జగిస్తూ అల్లారు ముద్దుగా పెంచుతుంది. తమ పిల్లలకు ఏ చిన్న ఆపద వచ్చినా విలవిలలాడిపోతుంది. బిడ్డలకు ఏ హానీ జరగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తను పస్తులుండిమరి బిడ్డల కడుపు నింపుతుంది కన్న తల్లి. కాగ పసి బిడ్డ ఏడ్చినప్పుడల్లా పాలు పట్టి పాప ఏడవకుండా చేస్తారు తల్లులు. కానీ ఓ తల్లి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. పదే పదే ఏడుస్తుందని పాల డబ్బాలో మద్యాన్ని నింపి పాపాయికి తాగించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పూర్తిగా రెండు నెలలు నిండని పసి బిడ్డకు పాలకు బదులు మందును పట్టించిన షాకింగ్ ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. హోనెస్టి డి లా టోర్రే అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. హోనెస్టి డి లా టోర్రే అనే మహిళ రెండు నెలల వయసున్న తన పాపతో కార్ డ్రైవింగ్ చేస్తుంది. ఆ సమయంలో పాప గుక్కపెట్టి ఏడవడం మొదలు పెట్టింది. దీంతో చిర్రెత్తిపోయిన ఆ మహిళ పాల డబ్బాలో ఆల్కాహాల్ నింపి పాపకు పట్టించింది. దానిని తాగిన తర్వాత ఆ చిన్నారి మత్తులోకి జారుకుని అనారోగ్యానికి గురయ్యింది. వెంటనే పాపను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా తల్లి పాప ఏడుపు ఆపడం కోసం పసి బిడ్డకు మందు పట్టించిన విషయం తెలుసుకోని షాక్ అయ్యారు. పాప ఆరోగ్యానికి హాని కలిగించేలా వ్యవహరించిన హోనెస్టి డి లా టోర్రేను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.