మనం బతుకుంది సోషల్ మీడియా యుగంలో. మన జీవితంలో ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడుపుతున్నాం. చాలా మంది.. తమ రోజులో అధిక భాగానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కొందరు ఓ అడుగు ముందుకు వేసి.. ప్రైవేట్ పనులను కూడా షేర్ చేస్తున్నారు. తాజాగా ఏపీలో ఈ తరహా ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు..
నేటి సోషల్ మీడియాలో యుగంలో.. కొందరు చేస్తోన్న పనులు చూస్తే.. వీళ్లకు మతి ఉండే ఇలా ప్రవర్తిస్తున్నారా.. లేక.. ఇంకేదైనా కారణాల వల్ల ఇలా చేస్తున్నారా అనేది అర్థం కాదు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం.. క్రేజ్ సంపాదించు కోవడం కోసం కొందరు వ్యక్తిగత జీవితాన్ని నెట్టింట పెడుతున్నారు. ఏది వ్యక్తిగతమో.. ఏది పబ్లిక్ అన్న సోయి కూడా లేకుండా.. పడకగది విషయాలను సైతం నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఈ వికృత పోకడ గ్రామాలకు సైతం పాకుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా సంఘటన చోటు చేసుకుంది. భర్యాభర్తల జీవితంలో మరపురాని తొలి రాత్రి ఘట్టాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ కిరాతక భర్త. ఆ వివరాలు..
ఈ దుర్ఘటన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి.. సభ్యసమాజం తలదించుకునే పని చేశాడు. భార్యతో తొలిరాత్రి ఏకాంతంగా గడిపిన క్షణాలను మదిలో భద్రంగా నిలుపుకోవాల్సింది పోయి.. వాటిని రికార్డ్ చేయడమే కాక.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కోనసీమ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఫిబ్రవరి 8న.. అదే గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహమైంది. అయితే అనూహ్యంగా అతడి మొదటి రాత్రి దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయం కాస్త వధువు కుటుంబానికి తెలియడంతో.. వధువు తల్లి గత నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణానికి పాల్పడిన వారు ఎవరు అనే దాని గురించి పోలీసులు విచారించగా.. దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇంతటి దారుణానికి పాల్పడింది.. మరి ఎవరో కాదు.. నవ వరుడే. స్వయంగా భర్తే.. తమ తొలి రాత్రి దృశ్యాలను సీక్రెట్గా రికార్డు చేసి.. దాన్ని అతడే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలుసులు అతడిని కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ ఘటన గురించి తెలియగానే పెద్ద మనుషులు పంచాయతీలో సెటిల్ చేసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. కానీ వధువు తల్లి.. ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. అంతేకాక.. ఇక్కడ వధువు మైనర్ అని తెలుస్తోంది. దాంతో బాల్య వివాహం నేర కనుక.. దీనిపై ఇరు కుటుంబాల తల్లిదండ్రులు, వివాహం చేసిన వ్యక్తి, గ్రామ పెద్దలను అడిగి వివరాలు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ దుర్ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.