ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కారు డ్రైవర్ పి చెన్నకేశవరావు గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం రాత్రి.. 8 గంటల ప్రాంతంలో గుంటూరు బ్రాడీపేటలో చోటు చేసుకుంది. సుచరిత బాడీగార్డులు, కారు డ్రైవర్లు.. ఆమె నివాసానికి కొద్ది దూరంలో ఉన్న హాస్టల్లో ఓ గది తీసుకుని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో పగలంతా విధి నిర్వహణలో ఉన్న చెన్నకేశవరావు.. రాత్రి తాను ఉండే హాస్టల్ గదిలోకి వచ్చాడు. ఆ తర్వాత సుచరిత వ్యక్తిగత భద్రతాధికారి రామయ్య గదిలోకి వచ్చాడు. తర్వాత తన పిస్టల్ తీసి.. దిండు పెట్టి స్నానానికి వెళ్లాడు. అది గమనించిన చెన్నకేశవరావు.. రామయ్య స్నానానికి వెళ్లగానే.. అతడు దిండు కింద పెట్టిన పిస్టల్ తీసుకుని.. నుదిటి భాగంలో కాల్చుకుని చనిపోయాడు.
కాల్పుల శబ్దం వినగానే.. రామయ్య బయటకు వచ్చి చూడగా.. అప్పటికే చెన్నకేశవరావు రక్తపు మడుగులో కనిపించాడు. వెంటనే ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుచరితకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుచరిత.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆధారాలు సేకరించి.. ఆ తర్వాత చెన్నకేశవరావు మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ బోధనాస్పత్రికి తరలించారు.
అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగానే.. చెన్నకేశవరావు.. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అతడి సహచర ఉద్యోగులు వెల్లడించారు. తనకు అప్పులు ఉన్నాయని.. వాటిని తీర్చలేకపోతున్నాను అంటూ తరచుగా తనతో చెప్పేవాడని సహచర ఉద్యోగులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాక.. కుటుంబంలో ఆస్తి గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు.
ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న నాగేశ్వరావు.. కొంత కాలం నుంచి.. సుచరిత దగ్గర కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇక చెన్నకేశవరావుకి భార్య, డిగ్రీ చదివే వయస్సున్న కుమారెడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే చెన్నకేశవరావు కుటుంబ సభ్యులు, బంధువులు.. సంఘటనా స్థలానికి చేరుకుని.. బోరున విలపించారు. ఇక చెన్నకేశవరావు భార్య, బిడ్డలను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.