తొందర పాటు నిర్ణయాల కారణంగా నేటి కాలంలో అనేక మంది ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. భార్య వంట రుచిగా వండలేదని భర్త, నచ్చిన చీర కొనివ్వలేదని భార్య. ఇలాంటి చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ప్రేమ విఫలమైందని కొందరు, మానసిక ఒత్తిళ్లు భరించలేక మరికొందరు ఇలా కారణాలు ఏమైన నిండు ప్రాణాలను చేజేతులా తీసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగా ఓ యువతి నాకు బతకాలని లేదంటూ సూసైడ్ లెటర్ రాసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
అసలేం జరిగిందంటే? అనంతపురం పట్టణంలోని ప్రత్యూష (26) అనే యువతి స్థానికంగా ఓ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా పని చేస్తుంది. అయితే ఈ యువతి విపరీతమైన కడుపు నొప్పి సమస్యతో బాధపడుతుండేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆ నొప్పి తీవ్రత ఎక్కువవడంతో ప్రత్యూష తట్టుకోలేకపోయింది. ఇక ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే రోజులానే కాలేజీకి వెళ్లిన ప్రత్యూష.. శుక్రవారం వారం కూడా వెళ్ళింది. పర్మిషన్ తీసుకుని కాస్త ముందుగా బయటకు వచ్చింది.
ఇక వస్తూ వస్తూనే స్థానికంగా ఉన్న రైల్వే పట్టాలపై పడి బలవన్మరణానికి పాల్పడింది. దీనిని గమనించిన రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రత్యూష బ్యాగు చెక్ చేయగా సూసైడ్ నోట్ లభ్యమైంది. ఇందులో.. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా చావుకి నేనే కారణం. నాన్న.. అమ్మని బాగా చూసుకో.. నేను చావడానికి కారణం ఏమీ లేదు. నాకే బతకాలని లేదు, అందుకే చచ్చిపోతున్నా సారీ అంటూ ప్రత్యూష రాసుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. కడుపు నొప్పిని భరించలేకే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యూష ఆత్మహత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.