ప్రేమ గుడ్డిది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి ఇద్దరి మనసులు కలిసిన తర్వాత ఇక వారిని విడదీయడం ఎవరితరమూ కాదు. ప్రేమ కోసం ఎంతోమంది ఎన్నో రకాల త్యాగాలు చేసేవాళ్ల గురించి మనం వినే ఉంటాం. ప్రేమకు అడ్డువచ్చిన వారిని చంపడానికి లేదా తాము ఆత్మహత్య చేసుకోవడానికి ఏమాత్రం ఆలోచించని జంట ఉంటారు. కానీ.. ప్రేమించిన వ్యక్తి కోసం ఓ యువతి హెచ్ఐవీ వైరస్ ఉన్న తన ప్రియుడి రక్తాన్ని శరీరంలోకి ఎక్కించుకుంది. అసోంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది. కామరూప్ జిల్లాలోని సువల్కచికి చెందిన 19 ఏళ్ల యువతికి మూడేళ్ల క్రితం ఫేస్బుక్లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరి మద్య ఫేస్ బుక్ ఛాటింగ్ జరిగిన కొన్ని రోజుల తర్వాత స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఎంతగా అంటే.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఒక రోజు తాను ప్రేమిస్తున్న యువకుడు హెచ్ఐవీ బాధితుడని యువతికి తెలిసింది. మొదట బాధపడ్డా.. అతనంటే పిచ్చి ప్రేమ.. అందుకే అతనితో మూడు సార్లు గ్రామాన్ని విడిచి పారిపోయింది. కానీ ఈ జంట ఎక్కడికి వెళ్లిని వెతికి పట్టుకొని యువతిని ఇంటికి తీసుకు వస్తున్నారు. తమ ప్రేమను పెద్దలు అర్థం చేసుకోరని.. ప్రతిసారి కుటుంబ సభ్యులు వేరు చేస్తున్నారని యువతి సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. సిరంజితో ఏకంగా తన బాయ్ఫ్రెండ్ రక్తాన్ని శరీరంలోకి ఎక్కించుకుంది. విషయం తెలిసిన యువతి కుటుంబీకులు మొదట నివ్వెరపోయారు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం యువకుడిని అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం యువతికి.. వైద్య పరీక్షలు జరిపించగా హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకున్నట్లు నిర్ధరణ అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది చదవండి: చనిపోయిందని తెలియక.. తల్లి శవంపై పడుకుని నిద్రపోయిన బాలుడు! ఇది చదవండి: పెళ్ళై ఏడాది గడిచిందో లేదో.. అంతలోనే!