మహిళలపై దాడులు జరుగుతున్న ఘటనలు తెలుగు రాష్ట్రాలలో అధికమవుతున్నాయి. ఇప్పటివరకు ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన ఈ తరహా దాడులు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో వరుసగా జరుగుతుండడంతో మహిళలకు భయందోళనకు గురవుతున్నారు. ఒక్క కాల్ చేస్తే ఐదు నిమిషాల్లో మీ ముందుంటాం అని పోలీసులు చెప్తున్నప్పటికీ.. వారొచ్చే అరగంట లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య, కన్న బిడ్డను కడతేర్చే ప్రయత్నం చేశాడు.. ఓ కసాయి తండ్రి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, భార్య ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు సమాచారం. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. ఆ వివరాలు..
ఆముదాలవలస పట్టణంలోని చోట్టవానిపేటకు చెందిన కొల్లి రామారావు-సూర్యం ఇద్దరూ భార్యాభర్తలలు. వీరికి ఇద్దరు కొడుకులు, కూతురు విజయ(30) సంతానం. పెళ్ళైన నాటి నుంచి రామారావుకు తాగుడు అలవాటు ఉన్నప్పటికీ ఎ మధ్య కాలంలో మద్యం అతిగా సేవిస్తున్నట్లు సమాచారం. అందుకు కారణం.. భార్య సూర్యంపై అనుమానం. ఈ వంకతో ఆమెను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఇవాళ మరోసారి గొడవ జరగగా, విచక్షణ కోల్పోయిన అతడు భార్యా కూతురుపై కత్తితో దాడి చేశాడు.
కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై విజయ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కొనఊపిరితో వున్న సూర్యంను స్థానికులు హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడు రామారావు పరారీలో వున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో నిందుతుడి వివరాలు తెలుసుకొని గాలింపు మొదలుపెట్టారు.