తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య రోజుకో మలుపు తిరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. గత నెల 17 న హరిహరకృష్ణ తన స్నేహితుడైన నవీన్ ని అత్యంతా పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్నో ట్విస్టులు తెరపైకి వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంలగా మారిన అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూ వస్తుంది. తాజాగా నవీన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రధాన నింధితుడు హరిహర కృష్ణతో పాటు అతడి స్నేహితుడు హసన్, ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్ హత్య కేసులో నింధితుడు హరిహర కృష్ణకు సహకరించడమే కాకుండా.. హత్య విషయం తెలిసినప్పటికీ పోలీసుల వద్ద దాచినందుకు ఇరువురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ ని అతని స్నేహితుడు హరిహర కృష్ణ అతి దారుణంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపింది. తన ప్రియురాలి కోసమే నవీన్ ని కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసుల కస్టడీలో చెప్పాడు నింధితుడు హరిహర కృష్ణ. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసులు హరిహరకృష్ణ ప్రియురాలు నిహారికతో పాటు అతని స్నేహితుడు హసన్ ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ కేసులో ఏ1 హరిహరకృష్ణ, ఏ2 గా హసన్, ఏ3 గా నిహారిక పేర్లు చేర్చారు. గత నెల 17 న జరిగిన నవీన్ హత్య కేసు వివరాలను ఎల్ బీ నగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. ఈ సందర్భంగా ‘నవీన్ హత్యకు ప్రేమే ముఖ్యకారణం.. నవీన్ హత్య విషయం తెలిసి నిహారిక, హసన్ తెలిసినా పోలీసులకు చెప్పలేదు.. ఈక్రమంలోనే వీరిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించాం’ డీసీపీ అని తెలిపారు.
ఇక హత్య జరిగిన అనంతరం హరిహరకృష్ణ ప్రియురాలు అతనికి రూ.1500 ట్రాన్స్ఫర్ చేసింది. అంతేకాదు ఈ ముగ్గురూ నవీన్ హత్య జరిగిన ఘటనా స్థలానికి వెళ్లి ఆ ప్రాంతం చూశారు. తర్వాత ఫోన్ కాల్స్, ఫోటోలకు సంబంధించిన డేటాను పూర్తిగా డిలీట్ చేశారు. హత్యకు సంబంధించిన ఎవిడెన్స్ రూపుమాపడానికి ప్రయత్నించారు.. ప్రస్తుతం నవీన్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుందని డీసీపీ సాయిశ్రీ పేర్కొన్నారు. ప్రస్తుతం హరిహరకృష్ణ పియురాలిని రిమాండ్ కి తరలిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.