సొమవారం రాత్రి సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం మూడవపల్లిలో శాలినీ అనే యువతిని నలుగురు యువకులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో తండ్రి ముందే ఆ యువకులు కూతురుని కిడ్నాప్ చేశారు. కూతురుని రక్షించేందుకు తండ్రి అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ తండ్రిపై ఆ యువకులు దాడి చేసి మరీ ఆ యువతిని కారులో తీసుకెళ్లిపోయారు. అనంతరం ఈ ఘటనపై శాలినీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనలో తాజాగా ఓ ఊహించిన ట్విస్ట్ చోటు చేసుకుంది.
తాజాగా కిడ్నాప్ గురైన శాలినీ ఓ వీడియోను విడుదల చేసింది. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇష్టంతోనే నా ప్రియుడు జానీతో వచ్చానని యువతి తెలిపింది. నేను, జానీ గత నాలుగు ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, నాకు జానీ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. కానీ మేము గతంలో పెళ్లి కూడా చేసుకున్నామని, కానీ అప్పట్లో మేము మైనర్లం కావడంతో ఆ పెళ్లి చెల్లలేదు. అయితే రాత్రి జానీకి ఫోన్ చేేస్తే అతడు వచ్చి నన్ను కారులో తీసుకెళ్లాడని ఆ యువతి తెలిపింది. నా ప్రియుడు జానీ దళిత కుటుంబానికి చెందినవాడు కావడంతో మా తల్లిదండ్రులు అతనితో పెళ్లికి ఒప్పుకోలేదు.
ఇక దీని కారణంగానే నేను జానీతో వచ్చి గుడిలో పెళ్లి చేసుకున్నామని యువతి తెలిపింది. మా తల్లిదండ్రులు, బంధువుల నుంచి మాకు ప్రాణహాని ఉందని, పోలీసులు మాకు రక్షణ కల్పించాలని యువతి శాలినీ తెలిపింది. అయితే రాత్రి కిడ్నాప్ గురైన యువతి ఇప్పుడు పెళ్లి చేసుకుని దర్శనమివ్వడంతో అంతా షాక్ కు గురవుతున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కిడ్నాప్ డ్రామాతో పెళ్లి చేసుకున్న యువతి తీరు ఎంత వరకు కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.