ఈ రోజుల్లో చాలా మంది పెళ్లైన వ్యక్తులు కట్టుకున్న వాళ్లని కాదని పరాయి వాళ్లతో వివాహేతర సంబంధం వైపు అడుగులు వేస్తున్నారు. క్షణిక సుఖం కోసం కోరికలు తీర్చుకుని హత్యలు, ఆత్మహత్యలతో చివరికి జీవితానికి ముగింపు పలుకుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ పెళ్లైన వ్యక్తి భార్యను కాదని పెళ్లైన మహిళతో అక్రమ సంబంధాన్ని నడిపించాడు. ఇక కొన్నాళ్ల తర్వాత అతడు భార్య కన్నా ప్రియురాలే ముఖ్యమని ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు నిలగీరి జిల్లాలోని ఓల్డ్ ఊటీ ప్రాంతం. ఇక్కడే జై శంకర్ (36) అనే వ్యక్తి గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక భర్త స్థానికంగా పెయింటర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ దంపతులు సంతోషంగా జీవిస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు భగ్గుమన్నాయి. దీంతో భర్త అప్పటి నుంచి భార్యతో కాకుండా విడిగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే జైశంకర్ కు స్థానికంగా ఉండే ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.
దీంతో జైశంకర్ భార్య కన్నా ప్రియురాలే ముఖ్యమని ఆమెతో ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. అలా కొన్ని రోజులు గడిచాక జైశంకర్ తన ప్రియురాలిని రెండవ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత జైశంకర్ తన రెండవ భార్యను ఇంటికి తీసుకురాగ, కుమారులు, భార్య ఎవరూ కూడా అతనితో సరిగ్గా మాట్లాడలేదు. దీంతో జైశంకర్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే అతడు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల తన ప్రియురాలిని తీసుకుని బొటానికల్ గార్డెన్ వద్దకు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక.. జైశంకర్, అతని రెండవ భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయాత్నానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ వారు అప్పటికే మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.