కరోనా నుంచి కోలుకుంటున్న ప్రపంచం తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటోంది. అయితే ఐటీ కంపెనీలను ఆర్థిక మాంద్యం భయాలు మాత్రం వదలడం లేదు. దీంతో అవి లేఆఫ్స్ బాటలో పడుతున్నాయి. ఇదే కోవలో మిగిలిన రంగాలకు చెందిన సంస్థలు కూడా పయనిస్తున్నాయి.
ప్రపంచంలోని దిగ్గజ సంస్థలను కూడా ఆర్థిక మాంద్యం భయాలు వీడటం లేదు. అందుకే బడా బడా టెక్ కంపెనీలు సహా ఈ-కామర్స్ సంస్థలు కూడా లేఆఫ్స్ బాట పడుతున్నాయి. ఖర్చుల్ని తగ్గించేందుకు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అదే విధంగా జాబ్లో కొనసాగే ఎంప్లాయీస్ జీతాల్లో కోతలు విధిస్తున్నాయి. ఇప్పుడు టెలికం కంపెనీలు కూడా ఆ దిశగానే సాగుతున్నాయి. ఈ క్రమంలో బ్రిటన్ ప్రముఖ టెలికం దిగ్గజం వొడాఫోన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్. వచ్చే మూడేళ్లలో ఏకంగా 11 వేల మంది ఎంప్లాయీస్ను తొలగించేందుకు వొడాఫోన్ సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని సంస్థ కొత్త సీఈవో మార్గరీటా డెలా వాలే తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు.
వొడాఫోన్ షేర్ల ధర రెండు దశాబ్దాల నాటి కనిష్ట స్థితికి చేరుకున్న టైమ్లో ఈ ప్రకటన చేశారు సీఈవో మార్గరీటా. సంస్థలో తొలగింపులు ఉంటాయని గత నవంబర్లోనే ఆమె ప్రకటించారు. కార్పొరేట్ పరిస్థితులకు తగ్గట్లుగా వేగంగా మార్పు చెందగలిగేలా కంపెనీని సంసిద్ధం చేయడంమే తన టార్గెట్ అని అప్పట్లో మార్గరీటా పేర్కొన్నారు. ఖర్చులు తగ్గించుకోవడం భాగంగానే ఉద్యోగులను తొలగించి, తద్వారా అందుబాటులోకి వచ్చే నిధులను కంపెనీ ఇతర అవసరాలకు మళ్లిస్తామని ఆమె స్పష్టం చేశారు. గొప్ప పనితీరు కనబర్చేందుకు పరిస్థితులకు తగ్గట్లుగా మార్పు చెందాల్సిన అవసరం ఉందని మార్గరీటా చెప్పుకొచ్చారు. కస్టమర్లు, డెవలప్మెంట్ ఇవే తమ ప్రాధాన్యతలు అని వ్యాఖ్యానించారు. ఖర్చులు తగ్గించుకుంటూ, కంపెనీని మరింత సింపుల్గా మార్చే క్రమంలోనే తొలగింపులు చేపడుతున్నట్లు ఆమె వివరించారు.
Vodafone’s new boss Margherita Della Valle announced 11,000 job cuts – the biggest in the history of Vodafone, which employs 90,000 people directly across Europe and Africa https://t.co/fAb0MGPNsA pic.twitter.com/SjQoVLIrB6
— Reuters (@Reuters) May 17, 2023