జాబ్ అనేది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. కంపెనీలు మూసివేయడం గానీ లేదా ఉద్యోగం కోల్పోవడం గానీ జరిగితే మళ్ళీ జాబ్ దొరికేవరకూ కష్టమే. అటువంటప్పుడు ఈ సరికొత్త జాబ్ ప్రొటెక్షన్ ప్లాన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెలకు రూ. 33, రూ. 83 ప్లాన్ తో మీరు జాబ్ లేకపోయినా జీతం తీసుకోవచ్చు.
కరోనా నుంచి కోలుకుంటున్న ప్రపంచం తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటోంది. అయితే ఐటీ కంపెనీలను ఆర్థిక మాంద్యం భయాలు మాత్రం వదలడం లేదు. దీంతో అవి లేఆఫ్స్ బాటలో పడుతున్నాయి. ఇదే కోవలో మిగిలిన రంగాలకు చెందిన సంస్థలు కూడా పయనిస్తున్నాయి.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే ఓ కలల ప్రపంచం. ఏసీ రూములో హాయిగా కంప్యూటర్ ముందు కూర్చొని పని, వారాంతంలో రెండు రోజులు సెలవులు, అప్పుడప్పుడు విదేశీ టూర్లు.. ఊహించుకుంటేనే ఎంత బాగుందో అనిపించేది. కానీ ఇప్పుడు మన ఉద్యోగాలు ఉంటాయంటావా..? అని ఒకరొకరు ప్రశ్నించుకుంటున్నారు.
టాప్ టెక్ కంపెనీలన్నీ లేఆఫ్స్ ప్రక్రియలో బిజీగా ఉన్నాయి. ఉన్న ఉద్యోగులను తీసేయడమే గాక.. కొత్తగా ఎవర్నీ రిక్రూట్ చేసుకోవడం లేదు. అమెజాన్ సంస్థ కూడా అదే తోవలో వెళ్లాలని ఫిక్స్ అయింది.
లే ఆఫ్స్ ఈ పదం ఐటీ ఉద్యోగులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎప్పుడు.. ఎవరిని పీకేస్తారో అంటూ భయంతో బతుకుతున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. మూడో దఫా లేఆఫ్స్ కూడా ఉంటాయంటూ వస్తన్న వార్తలు ఉద్యోగులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
ఉద్యోగాల కోతలు పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. కంపెనీ సిబ్బందిలో సుమారు 85 శాతం మందిని తొలగిస్తున్నట్లు ఓ దిగ్గజ కంపెనీ గురువారం ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో దాదాపు 675 మంది రోడ్డున పడనున్నారు. ఆ కంపెనీ ఏంటి..? ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
దిగ్గజ టెక్ కంపెనీలు వరుసబెట్టి ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తీసేస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేఆఫ్స్ చేసినా.. ఆ సంస్థలకు ఊరట దక్కడం లేదు. పైగా కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్. మరో ఐటీ దిగ్గజ సంస్థ లేఆఫ్స్కు తెరతీసింది. ఏకంగా 19,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటన చేసింది. ఇప్పటివరకు చోటుచేసుకున్న టెక్ కంపెనీల ఉద్యోగుల తొలగింపులో ఇదే అతి పెద్ద లేఆఫ్స్ కావడం గమనార్హం.