రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023వ సంవత్సరంలో తొలి ద్రవ్య పరపతి సమీక్షను నిర్వహించింది. ఆర్థిక నిపుణులు అందరూ ఊహించిన విధంగానే మరోసారి రెపో రేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాతం దాస్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని మానిటరీ పాలసీలో ఆరుగురు సభ్యులు నలుగురు సమర్థించారన్నారు. ఈ తాజా పెంపుతో కీలక వడ్డీ రేట్లు 6.5 శాతానికి పెరిగాయి. ఈ కీలక వడ్డీ రేట్ల పెంపుతో నెలవారీ చెల్లించే ఈఎంఐలపై మరింత భారం పడనుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
ఈనెల 6న ఆర్బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష మొదలైన విషయం అందిరికీ తెలిసిందే. 2023లో ఇదే తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష. ఈ సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో కీలక వడ్డీ రేట్లు 6.5 శాతానికి చేరాయి. ఇంతకంటే ముందు మొత్తం నాలుగుసార్లు 85 బేసిస్ పాయింట్లు పెంచారు. గత డిసెంబరులో 35 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీ రేట్లు 6.25కి చేరాయి. అంతకంటే ముందు 3 సమీక్షల్లో 50 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేందుకు గతేడాది మే నుంచి రెపో రేటును మొత్తం 250 బేసిస్ పాయింట్లు పెచింది. రివర్స్ రెపో రేటులో మాత్రం ఈసారి ఎలాంటి మార్పు చేయలేదు. దానిని 3.35గానే ఉంచారు.
తాజాగా తీసుకున్న నిర్ణయంతో సామాన్యులపై తీవ్ర భారం పడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పెరిగిన వడ్డీ రేట్లను మరోసారి పెంచడంతో.. నెలవారీ చెల్లింపులు పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే ఈఎంఐలు కడుతున్నారో వారిపై భారం పడనుంది. హౌస్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న వారు నెలా నెలా ఇంకాస్త ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. జీడీపీ విషయానికి వస్తే.. 2023 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనా 6.8 నుంచి 7 శాతానికి పెరిగింది. 2023-24 ఏడాదిలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 6.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రెపో రేటును మరోసారి పెంచిన RBI..
2023 తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో నిర్ణయం. వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం. తాజా నిర్ణయంతో 6.5 శాతానికి చేరిన కీలక వడ్డీ రేట్లు. EMIలు భారీగా పెరిగే అవకాశం.#rbi #emi #TeluguNews #Sumantv #reporate— SumanTV (@SumanTvOfficial) February 8, 2023