కరోనా కష్ట కాలం నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న వాహనదారులకు ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ఊపిరాడకుండా చేశాయి. వరుసగా పెట్రోల్ ధరలు పెంచడంతో వాహనాదారులు సతమతమయ్యారు. అయితే ఇప్పుడు ఆయిల్ కంపెనీలు వాహనాదారులకు శుభవార్తను అందించనున్నాయి.
సొంత వాహనాలపై ఉద్యోగాలకు వెళ్లే వారు, డ్రైవింగ్ వృత్తిని ఎంచుకుని జీవించేవారు ఆకాశానంటుతున్న పెట్రోలో, డీజిల్ ధరలతో బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించండని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. బంకుకు వెళ్లి పెట్రోల్ కొట్టిద్దామంటే వాహనదారులకు గుండెజారినంత పనైతాంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, చిరుద్యోగులు, ట్యాక్సీ నడుపుకునే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇలాంటి తరుణంలో ఆయిల్ కంపెనీలు వాహనదారులకు ఊరటనిచ్చే విషయాన్ని చెప్పబోతున్నాయి. త్వరలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంతర్జాతీయంగా చోటుచేసుకున్న చమురు ధరల్లో మార్పుల కారణంగా ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరల్లో అనిశ్చితి ఏర్పడేది. ఏ రోజు ఎంత రేటు పెరుగుతుందో తెలిసేది కాదు. కానీ గత సంవత్సర కాలంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు. అంతర్జాతీయి చమురు ధరలతో సబంధం లేకుండా ఆయిల్ కంపెనీలు ధరలను మార్చలేదు. దీంతో ఆయిల్ కంపెనీలు భారీగా లాభపడ్డాయి. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీలు ధరలను తగ్గించాలని నిర్ణయించాయి. దీంతో త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనే సంకేతాలు వస్తున్నాయి. దీనిపై పూర్తిగా క్లారిటీ రావాలంటే రెండు మూడు రోజులు ఆగాల్సిందే.
దీనికి గల కారణం ఆయిల్ కంపెనీల నష్టాలు తగ్గడమే. ఈ మధ్య ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ఆయిల్ కంపెనీలు గణనీయమైన ఆదాయం గడించాయి. దీంతో వస్తున్న లాభాలతో ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయంతో వాహనదారులకు భారీ ఊరట లభించినట్లవుతుంది. కాగా ధరల తగ్గింపు అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది ఇంకా స్పష్టత రాలేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎంత తగ్గుతాయి, ఏ తేదీ నుంచి అమలు చేస్తారని వాహనాదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయన్న సమాచారంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.