ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైన ప్రకటన వెలువడుతోంది అంటే చాలు దేశ ప్రజలు చూపు మెుత్తం అటు వైపే. మళ్లీ ఏ ధరలు పెరుగుతాయో అని. ఈ క్రమంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాక పోతే ఈ నిర్ణయం వినియోగదారులకు ఉరటనిచ్చేదే కావడంతో ప్రజలు ఉపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఏటీఎమ్ వినియోగదారులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏదైన ప్రకటన చేస్తే చాలు దేశం మెుత్తం ఆమె వైపే చూస్తుంది. తాజాగా జీఎస్టీ పెరుగుదల నిర్ణయంతో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రాజ్యసభలో మాట్లాడుతూ మరో కీలక ప్రకటన చేశారు. బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పారు. వినియోగదారులు ఏటిఎమ్ ల నుంచి క్యాష్ విత్ డ్రా చేసే సమయంలో విధించే ఛార్జీలపై ఆమె క్లారిటీ ఇచ్చారు.
రాజ్యసభలో సీతారామన్ మాట్లాడుతూ.. ఖాతాదారులు వారి సొంత బ్యాంక్ ఏటిఎమ్ ల నుంచి నెలకు 5 సార్లు, ఇతర బ్యాంక్ ఏటిఎమ్ ల నుంచి మరో 5 సార్లు నగదును విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు. వీటిపై ఎలాంటి ఛార్జీలు ఉండవని ఆమె స్పష్టం చేశారు. గతంలో ఈ వెసులు బాటు 5 సార్లు మాత్రమే ఉంది. అదే విధంగా బ్యాంకుల నుంచి డబ్బులను తీసుకునే క్రమంలో ఎలాంటి జీఎస్టీ ఉండబోదని నిర్మలా సీతారామన్ తెలిపారు.
కానీ ప్రింటర్ నుంచి బ్యాంకులు కొనుగోలు చేసే చెక్ బుక్ లపై మాత్రం జీఎస్టీ ఉంటుందని వెల్లడించారు. వినియోగదారుల చెక్ బుక్ లపై పన్ను ఉండదని వివరించారు. ప్యాక్ చేసిన ఫుడ్ పై 5 శాతం జీఎస్టీ విధించే ప్రతిపాదనలకు జీఎస్టీ కౌన్సిల్ లోని అన్ని రాష్ట్రాలు అంగీకరించాయిని రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా నిర్మల సీతారామన్ వివరించారు. మరి కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | “There is no GST on withdrawal of cash from banks… 5+5=10 transactions in a month is totally free when withdrawn from ATMs,” said Finance Minister Nirmala Sitharaman, in a discussion on the rising prices, in Rajya Sabha pic.twitter.com/CdFNbnWvWv
— ANI (@ANI) August 2, 2022
ఇదీ చదవండి: 5G Network: 5జీ టెక్నాలజీ అంటే లాభాలే కాదు! ఈ నష్టాలు కూడా ఉంటాయి!
ఇదీ చదవండి: భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం.. భార్య ఏంచేసిందంటే!