ఈ మద్య కొంతమందికి వివాహబంధం అంటే చులకనైపోయింది. వివాహం అంటే నూరేళ్ల పంట కాదు.. మూడు రోజుల ముచ్చట అనే పరిస్థితికి వచ్చింది. ప్రియుడి మోజులో భర్తల్ని చంపుతున్న భార్యలు, భార్యను మోసం చేసి నిత్యపెళ్లికొడుకుల్లా వెలుగుతున్న భర్తలు ఊరికొకరు తయారయ్యారు. పెళ్లి మండపం దిగి ఏడాది తిరగకుండానే కోర్టు గడపలు ఎక్కుతున్నారు. పెళ్లినాటి ప్రమాణాలకు నీళ్లొదిలేసి.. ఎవరి దారి వారు చూసుకునే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ కుటుంబ కలహాలను తాళలేక డెత్నోట్ రాసి బిడ్డతో కలసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నాగమంగల తాలూకా కెంచెగౌడనకొప్పలో జరిగింది. నాగమంగల తాలూకా కెంచెగౌడనకొప్పలో మాజీ జడ్పీ సభ్యుడు దొరెస్వామి–సునంద దంపతుల కుమార్తె బిందు. నాగమంగల కుంభార వీధి నివాసి నవీన్ ని నాలుగేళ్ల క్రితం ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దాంతో గుళ్లో పెళ్లి చేసుకున్నారు. మొదట్లో దంపతులు అన్యోన్యంగా కాపురం చేశారు.. కొంత కాలం తర్వాత వీరిద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. బింధు ని నవీన్ తన ఇంటికి తీసుకు వచ్చాడు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా తన కొడుకు ను పెళ్లి చేసుకుందన్న అక్కసుతో.. బిందును అత్త, మామ, ఆడపడుచులు వేధించడం మొదలైంది. మరోవైపు బింధు భర్త నవీన్ వేరే మహిళ తో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న బింధు భర్తను మారాలని ప్రాధేయపడింది. కానీ ఆమె మాటలు లెక్కచేయకుండా కొట్టడం మొదలు పెట్టాడు. ఇక సహించలేక బిందు తన పది నెలల కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా తరచూ ఫోన్లో గొడవపడుతూ ఉండేవారు. తన జీవితంలో జరుగుతున్న సంఘటనలతో జీవితంపై విరక్తి చెందిన బింధు.. చిన్నారికి ఉరి వేసి తరువాత తానూ అదే వైరుతో ఉరి వేసుకుంది. ఉరి వేసుకునే ముందు బింధు తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నానో అన్న విషయం గురించి సూసైడ్ నోట్ రాసింది. తన చావుకు భర్త నవీన్, అత్త, మామ, ఆడపడుచు కారణమని పేర్కొంది. ఘటనా స్థలానికి చేరుకున్న నాగమంగల పోలీసులు ఇరువురి మృతదేహాలను పట్టణంలోని ప్రజా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. బిందు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది చదవండి: స్నేహితురాలితో కలసి డ్యూటీకి వెళ్లి.. ఆ బాధని భరించలేకపోయింది! ఇది చదవండి: రాక్షసుడిలా మారిన భర్త.. పెళ్ళైన రెండు నెలలకే!