1జీ.. 2జీ అంటూ మొబైల్ టెక్నాలజీ బుడిబుడి అడుగులతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 3జీతో వేగం పెంచుకొని, సరికొత్త సాంకేతిక యుగంలోకి ప్రవేశించింది. సెల్ ఫోన్తో దేశాన్ని డిజిటల్మయం చేసింది. ఆ వెంటే వచ్చిన 4జీ అద్భుత వేగంతో మానవ జీవితాలపై తిరుగులేని ముద్ర వేసింది. స్మార్ట్ ఫోన్ ద్వారా యావత్ ప్రపంచాన్ని అరచేతుల్లోకి తీసుకొచ్చింది. వన్, టూ, త్రీ, ఫోర్.. అంటూ పరుగులు తీసి, ప్రస్తుతం ఐదో తరానికి చేరుకుంది. మరి.. ఈ ఐదో తరం వల్ల మానవాళికి ముప్పు పొంచివుందా? నష్టాలు తప్పవా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎన్నో ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీ వేదికగా శనివారం నాడు ఇండియా మొబైల్ కాంగ్రెస్ను ప్రారంభించిన మోదీ… 5జీ సేవలను అధికారికంగా ఆవిష్కరించారు. వినియోగదారుల కోసం టెలికం సంస్థలు అక్టోబర్ నెలాఖరు నుంచి కమర్షియల్ 5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తేనున్నాయి. అయితే ముందుగా కొన్ని మెట్రో నగరాల్లోని వినియోగదారులకు 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. తొలుత రియలన్స్ జియో, ఎయిర్టెల్ ఈ నెలాఖరులోగా 5జీ నెట్వర్క్ను కమర్షియల్గా లాంచ్ చేయనున్నాయి. ఈ క్రమంలో 5జీ టెక్నాలజీ వల్ల మానవాళికి ముప్పు ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. రేడియేషన్ ప్రభావం ఒక్కటే కాదు.. 4జీ కంటే ఎన్నో రెట్లు వేగవంతమైన టెక్నాలజీ ఉన్నప్పుడు మన డేటా హ్యాకర్ల చేతికి చిక్కితే ఏమైనా ఉందా! అంటూ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రేడియేషన్ ప్రభావం: 'సెల్ఫోన్ టవర్ల నుంచి, మొబైల్స్ నుంచి వెలువడే రేడియేషన్ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?’ అనే ప్రశ్న దశాబ్ద కాలంగా వినిపిస్తున్నదే. దీనికి స్పష్టమైన సమాధానాలు మాత్రం లేవు. సెల్ఫోన్ మొహానికి దగ్గరగా ఉన్నప్పుడు మెదడు మీద దుష్ప్రభావాలు ఉంటాయని, అతిగా వాడుతుంటే ఒళ్ళు నొప్పులొస్తున్నాయని, ప్యాంట్ జేబులో పెట్టుకుంటే వీర్యకణాలు తగ్గిపోతున్నాయని, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక సమస్యలు వస్తున్నాయనీ.. రకరకాల అభిప్రాయాలు ప్రచారంలో అయితే ఉన్నాయి. 5జీ వల్ల కలిగే సమస్యలు: 5జీ సర్వీసెస్ వల్ల డేటా సేఫ్టీ సహా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. డేటా సెక్యూరిటీ కోసం 5జీలో 4జీ కన్నా ఎక్కువగా డేటా ఎన్క్రిప్షన్ జరుగుతుంది. కానీ అన్ని రకాల డేటా ఎన్క్రిప్షన్ జరగదు. దీని వల్ల ఆ డేటాను 5జీ బేస్ స్టేషన్స్, యాంటీనాస్ యాక్సిస్ చేసే వీలు కుదరడంతో కంపెనీలు డేటాను వాటి ఇష్టానికి వాడుకునే ప్రమాదం ఉంది. గతంలో ఎన్నడూ ఊహించనంత రేంజ్లో పర్సనల్ డేటా ట్రాన్స్మిషన్ జరిగిపోయే ముప్పు ఉంది. దీంతో యూజర్ల లైఫ్ స్టైల్, హాబీస్, ఇంటి అడ్రస్, మొత్తం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా టెలికాం కంపెనీల చేతిలోకి వెళ్లిపోతుంది. ప్రైవేట్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వాటి బిల్డింగ్స్లోకి క్రిమినల్స్ చొరబడకుండా సెట్ చేసుకునే స్మార్ట్ లాక్లను కూడా 5జీ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ద్వారా హైజాక్ చేసే చాన్స్ ఉంది. సిగ్నల్ టవర్ల మానిప్యులేషన్ చేసి ఇద్దరు సేమ్ నెట్వర్క్ యూజర్ల మధ్య జరిగే చాటింగ్లో హ్యాకర్లు నేరుగా జోక్యం చేసుకునే చాన్స్. భవిష్యత్తులో రాబోయే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో నేవిగేషన్కు 5జీ నెట్వర్క్ వాడాల్సి వస్తుంది. అయితే 5జీ నెట్వర్క్ ఆపరేటర్లు కార్ను హ్యాక్ చేసి దానిలో ఉన్న వారికి హాని తలపెట్టొచ్చు. ఉగ్రవాదులు లేదా మరో దేశంపై కక్ష సాధించాలనుకునే దేశాలు 5జీని దుర్వినియోగం చేసి న్యూక్లియర్ ప్లాంట్స్, ఎయిర్ పోర్టులను వాళ్ల కంట్రోల్లోకి తీసుకునే ముప్పు ఉంది. 5జీ డివైజ్లలో స్టోర్ అయ్యి ఉండే డేటా అంతా క్లౌడ్లో సేవ్ అవుతుంది. 5జీ ఆపరేటర్స్ దీనిని వాడుకునే ముప్పు లేకపోలేదు. అలాగే క్లౌడ్పై హ్యాకర్లు అటాక్ చేసే ప్రమాదం ఉంది. 5జీ డివైజ్లలో యూజర్కి కూడా తెలియకుండానే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఆ టైమ్లో స్పైవేర్ లేదా ఇతర మాల్వేర్ వైరస్లను ఇన్సర్ట్ చేసే చాన్స్ ఉంది. కంపెనీల చేతిలోకి యూజర్ల పర్సనల్ డేటా: అన్ ఎన్క్రిప్టెడ్ డేటాను బేస్ స్టేషన్లలో యాక్సిస్ చేయొచ్చు. క్లౌడ్లో సేవ్ అయ్యే యూజర్ల డేటా హ్యాకింగ్ జరిగే ముప్పు. 5జీ ఫ్రీక్వెన్సీతో ప్రైవేట్ కంపెనీల సెక్యూరిటీ హైజాక్ చేసే ముప్పు. 5జీ నేవిగేషన్తో నడిచే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను హ్యాక్ చేసే ప్రమాదం. సిగ్నల్ టవర్ల మ్యానిప్యులేషన్తో యూజర్ల మెసేజ్లలో హాకర్ల జోక్యం. ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ అప్ డేట్ టైమ్లో హ్యాకర్లు స్పైవేర్ ఇన్సర్ట్ చేసే చాన్స్ ఉంది. 5G ఎలా పనిచేస్తుంది 5జీ.. అత్యాధునిక సాంకేతికతతో పనిచేస్తుంది. పైగా రేడియో తరంగాలను సమృద్ధిగా, సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. ‘నెట్వర్క్ స్లైసింగ్’ అనే ప్రక్రియ ద్వారా సిమ్కార్డు అనేక తరంగాలను ఒకేసారి వినియోగించుకుంటుంది. ఇలాంటి మార్పులతో అసాధారణ ఫలితాలు కనిపిస్తాయి. ధర ఎలా ఉండొచ్చు? విశ్లేషకుల అంచనాల ప్రకారం 5జీ అందుబాటులోకి రాగానే దాన్ని అందుపుచ్చుకునేందుకు 67 శాతం మంది సిద్ధంగా ఉన్నారు. మరి, ధరలు అందుకు అనుమతిస్తాయా లేదా అన్నది చూడాలి. 4జీతో పోల్చుకుంటే 5జీ సేవలు కచ్చితంగా ఖరీదే! అయితే, పారిశ్రామిక వర్గాలనుంచి ఎక్కువ వసూలు చేస్తే సాధారణ వినియోగదారుల భారాన్ని తగ్గించవచ్చనే ఆలోచనలో టెలికాం కంపెనీలు ఉన్నాయట. అంతేకాదు, 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాక కూడా 4జీ అందుబాటులో ఉంటుందని హామీ ఇస్తున్నాయట. పైగా, మారుతున్న సాంకేతికత వల్ల 4జీ వేగం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: దేశంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం.. 5జీ సేవలు ప్రారంభించిన మోదీ! ఇదీ చదవండి: 5జీ టెక్నాలజీ రాబోతోంది.. ఈ క్రమంలో 20వేల లోపు లభించే బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ మీకోసం..!