ప్రతిష్ఠాత్మకమైన ‘కాన్స్ చలనచిత్రోత్సవం’ ఈసారి కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సహజంగానే ఈసారి అక్కడ ‘రెడ్ కార్పెట్’పై అందాలు ఒలికించే భారతీయ తారలు ఎవరని అందరికీ కుతూహలంగా ఉంటుంది. ప్రముఖ హీరోయిన్లు ఐశ్వర్యారాయ్ బచ్చన్, సోనమ్ కపూర్లు ఈ తడవ కూడా ‘కాన్స్’లో సందడి చేయబోతున్నారు. ప్రముఖ బ్రిటీష్ మోడల్, నటి ఎమీ జాక్సన్ కూడా ఆ జాబితాలో చేరుతున్నారు. 74వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో భాగంగా బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ రెడ్ కార్పెట్పై హోయలు పోయింది.
కరోనా మహమ్మారి విజృంభణతో గతేడాది ఈ కార్యక్రమం రద్దయింది. ఈ ఏడాది జూలై 6 నుండి జూలై 17 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అమీ జాక్సన్ ఇప్పటికే తెలుగులో రామ్చరణ్ ‘ఎవడు’తో సహా తమిళంలో ‘ఐ’, ఇటీవలి ‘తంగమగన్’, ‘తెరి’ , ‘2.0’ లాంటి చాలా సినిమాలతో ఎమీ మన దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచితమే. పట్టుమని పాతికేళ్ళు కూడా లేని ఈ అందాల రాశి ప్రస్తుతం ఒక పక్క షూటింగ్, మరోపక్క ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అమీ జాక్సన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ట్రెండీ లుక్లో కనిపించి మురిపించింది. దర్శకుడు శంకర్ తీసిన ‘ఐ’ సినిమాతో టాప్ యాక్ట్రస్ స్థాయికి చేరాలన్న అమీ జాక్సన్ ఆశకు గండిపడింది. కానీ శంకర్ ఆమెకు మరో ఛాన్స్ ఇస్తూ రోబో సీక్వెల్ 2.0 లో రజనీకాంత్ పక్కన హీరోయిన్ గా తీసుకున్నాడు. ఈ సినిమా కూడా తన కెరీర్కు ఏ మాత్రం ఉపయోగపడలేదనే చెప్పాలి.
అయితే ఒక బిడ్డకు తల్లైనా కూడా అమీ గ్లామర్ చెక్కు చెదరలేదు. గత కొన్నేళ్లుగా జార్జ్ పనాయిటోయ్తో అమీ సహజీవనం చేస్తుండగా వీరిద్దరికి 2019లో ఒక బాబు కూడా జన్మించాడు. అప్పటినుంచి బాబు కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ వస్తుంది. ఈ కాన్స్ చలనచిత్రోత్సవం కోసం అమీ దాదాపు పాతిక నుంచి 30 దాకా దుస్తులు కుట్టించిందిట.