ప్రపంచ కుబేరుల్లో ఒకరు ముఖేష్ అంబానీ. విలాసవంతమైన జీవితం, అందమైన భార్య, ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు. ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ. వీరిలో ఆకాష్, ఇషాలకు పెళ్లిళ్లయ్యి.. పిల్లలున్నారు. ఇక అనంత్ అంబానీ..
ప్రపంచ కుబేరుల్లో ఒకరు ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ఆస్తుల విలువ తాజా లెక్కల ప్రకారం అక్షరాలా 1.52 లక్షల కోట్ల రూపాయలు. విలాసవంతమైన జీవితం, అందమైన భార్య, ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు. ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ. వీరిలో ఆకాష్, ఇషాలకు పెళ్లిళ్లయ్యి.. పిల్లలున్నారు. అనంత్ అంబానీకి కూడా రాధిక మర్చంట్తో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగిన సంగతి విదితమే. గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఈ పిల్లల జీవితాలు రెడ్ కార్పెట్లా సాఫీగా సాగిపోయింటాయి అనుకుని ఉంటారు. తాత గారి ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్న వీరు లగ్జరీ లైఫ్కు దూరంగా బతికారట. ఓ సందర్భంలో అనంత్ అంబానీని ఎగతాళి చేశారట తోటి విద్యార్థులు.
ఇంతకు అనంత్ అంబానీని ఎందుకు ఎగతాళి చేశారంటే. తాత గారి స్కూల్లో చదువుకున్నా డబ్బులు విలువ తెలియాలని పాకెట్ మనీ కింద పిల్లలకు రూ. 5 మాత్రమే ఇచ్చేవారట ముఖేష్, నీతా అంబానీలు. దీంతో అదే ఐదు రూపాయలతో స్కూల్ క్యాంటీన్లో కొన్నుకునేందుకు వెళ్లినప్పుడు తోటి విద్యార్థులంతా ఎగతాళి చేశారు. తూ అంబానీ హై యా భికారీ (నువ్వు అంబానీవా భికారివా) అని వెక్కిరించినట్లు అనంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ విషయాన్ని చెప్పగానే.. అక్కడే ఉన్నా తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఉలిక్కి పడ్డారు. అనంత్ అంబానీ బ్రౌన్ యూనివర్శిటీలో చదువు పూర్తి చేసి ప్రస్తుతం అనేక రిలయన్స్ వెంచర్లకు డైరెక్టర్గా ఉన్నారు. ప్రస్తుతం నికర ఆస్తుల విలువ సుమారు 40 బిలియన్ డాలర్లు అని సమాచారం. త్వరలోనే రాధిక మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు.