ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్.. అంటే తెలియని వారుండరు. ఇప్పటివరకు నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని 5వ సీజన్ రన్ అవుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్-5 చివరి దశకు చేరుకుంది. దీంతో హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్లకు మద్దతుగా సెలబ్రిటీలు రంగంలోకి దిగుతున్నారు. వీరిలో సింగర్ శ్రీరామచంద్రకు బిగ్ బాస్ హౌస్ బయట మద్దతు గట్టిగానే లభిస్తుంది. గతంలో సోనూసూద్, ఆర్టీసీ ఎండీ సజ్జానార్, శంకర్ మహదేవన్, హీరోయిన్ పాయల్ రాజపుత్ శ్రీరామ్ కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.
అయితే అనూహ్యంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవి నుండి శ్రీరామచంద్రకు మద్దతుగా నిలవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేగాక శ్రీరామ్ కు ఓట్లేసి గెలిపించాలని శ్యామలదేవి ఓ వీడియో సందేశం కూడా విడుదల చేయడం విశేషం. ప్రస్తుతం ఆమె మద్దతు ప్రకటించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీరామచంద్రకు స్వయంగా కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లభించడంతో శ్రీరామ్ ఫాలోవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.