‘బిగ్ బాస్ 5 తెలుగు’ రానురాను ఆట ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. తొలి ఫైనలిస్టు కూడా ఎంపికైపోయాడు. సింగర్ శ్రీరామచంద్ర తొలి ఫైనలిస్టుగా అవతరించిన విషయం తెలిసిందే. శ్రీరామచంద్ర అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఒక పోస్టు బాగా వైరల్ అవుతోంది. టాస్కులో గాయపడి కాళ్లకు కట్లు కట్టుకొని మంచానికి పరిమితమైన శ్రీరామచంద్రకు మోరల్ సపోర్ట్ గా ఒక పోస్టు పెట్టింది దీప్తీ సునైనా. ఇప్పుడు ఆ పోస్టును తెగ వైరల్ చేస్తున్నారు. షణ్ముఖ్ మీద కోపంతోనే శ్రీరామచంద్రకు దీప్తీ సునైనా సపోర్ట్ చేస్తోందంటూ చెప్పుకొస్తున్నారు.
శ్రీరామచంద్ర పరిస్థితి చూసి నిజానికి చాలా మంది సెలబ్రిటీలు తమ మద్ధతు తెలిపారు. శ్రీరామ్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. కానీ, దీప్తీ సునైనా సపోర్ట్ చేసిన పోస్టు మాత్రం బాగా ప్రాచుర్యం పొందింది. అందుకు కారణం కూడా ఉంది లెండి. మొన్నటి వరకు సిరి- షణ్ముఖ్ రిలేషన్ అని వార్తలు వినిపించాయి. గెట్ టూ గెదర్ తర్వాత మారారులే అనుకునే సమయానికి మళ్లీ అవే సీన్లు కనిపిస్తున్నాయి. అందుకే దీప్తీ సునైనా షణ్ముఖ్ పై కోపంతోనే అలా చేసిందని కొందరి వాదన.
అయితే అక్కడ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదనేది షణ్ముఖ్ ఫ్యాన్స్ వర్షన్. శ్రీరామచంద్ర ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టి త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ దీప్తీ అలా పోస్టు చేసిందని సమర్ధిస్తున్నారు. దీప్తీ సునైనా సపోర్ట్ కు సిరినే కారణమా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.